Breaking News

ఈనెల17 నుండి అక్టోబరు 2 వరకు స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం : సిఎస్

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల17 నుండి అక్టోబరు 2వ తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాన్ని విజయవతంగా నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు.స్వచ్ఛతా హి సేవా కార్యక్రమానికి సంబంధించి గురువారం రాష్ట్ర సచివాలయంలో వివిధ లైన్ డిపార్ట్‌మెంట్ల కార్యదర్శులతో రాష్ట్ర స్థాయి తొలి స్టీరింగ్ కమిటీ సమావేశం,జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ ఈ పరిశుభ్రత ప్రచార కార్యక్రమం ఈనెల 17న ప్రారంభమై పక్షం రోజుల పాటు అనగా గాందీ జయంతి అక్టోబరు 2వరకూ నిర్వహించాలని చెప్పారు.ఇందుకు సంబంధించి సన్నాహక కార్యక్రమం ఈనెల14 నుండి ప్రారంభమవుతుందన్నారు. స్వచ్ఛతా హి సేవా ప్రచారం వివిధ కార్యక్రమాల ద్వారా లక్షలాది మంది పౌరులను సమీకరించడానికి రూపొందించ బడిందని ఈప్రచారం ప్రవర్తనలో భాగంగా స్వచ్ఛతను ప్రోత్సహించడం పై ప్రజల్లో అవగాహన కలిగించాలని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ చెప్పారు.రాబోయే స్వచ్ఛతా హి సేవ ప్రచారం 2024 కోసం సన్నాహకాలపై సిఎస్ అధికారులకు దిశానిర్దేసం చేశారు.రాష్ట్రవ్యాప్తంగా పరిశుభ్రత అగగాహన కార్యక్రమాలను ఈ నెల 17న నుండి ప్రారంభించి పక్షం రోజుల పాటు నిర్వహించాలన్నారు.
17 సెప్టెంబర్ నుండి అన్ని జిల్లాలు,పట్టణ స్థానిక సంస్థలు క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్ల (CTUలు) పరివర్తనను ప్రారంభించాలని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు.పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల కేంద్రాల్లోను సామూహిక పరిశుభ్రత డ్రైవ్‌లను నిర్వహించాలని అన్నారు.ఈకార్యక్రమ పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో సిఎస్ అధ్యక్షతన రాష్ట్ర స్టీరింగ్ కమిటీ,జిల్లా స్థాయిలో జిల్లా కలక్టర్ అధ్యక్షతన జిల్లా కమిటీలు ఏర్పాటై ప్రచారాన్ని పర్యవేక్షించడానికి ఒక నోడల్ అధికారిని నియమించండ జరుగుతుందని తెలిపారు.ప్రచార కార్యకలాపాలు మరియు ఉత్తమ అభ్యాసాలను హైలైట్ చేయడానికి, పౌరులు మరియు లబ్ధిదారుల వాయిస్‌లను విస్తరించడానికి జిల్లాలు, యుఎల్‌బిలు,రాష్ట్రంలో ప్రతిరోజు అప్‌డేట్‌లు, ప్రోగ్రెస్ రిపోర్ట్‌లు, విజయాలను పోస్ట్ చేయడానికి నిరంతరం పనిచేసే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు.అదే విధంగా రాష్ట్ర,జిల్లా స్థాయిల్లో అన్ని శాఖలు ఈకార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని అన్నారు.అంతేగాక రాష్ట్రవ్యాప్తంగా పౌరులను పెద్దఎత్తున భాగస్వాము లను చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా పరిశుభ్రత మరియు పరిశుభ్రత ను పెంపొందించడానికి స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు.
ఈసమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జి.అనంత రాము,అనిల్ కుమార్ సింఘాల్, ఎం.టి.కృష్ణ బాబు,ముఖ్య కార్యదర్శులు శశిభూషణ్ కుమార్,కాంతిలాల్ దండే, స్వచ్చాంధ్ర కార్పొరోషన్ ఎండి గంధం చంద్రుడు తదితర అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *