తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డా. ధనంజయ వై. చంద్రచూడ్ ఈ నెల సెప్టెంబర్ 28,29 తేదీలలో తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. భారత ప్రధాన న్యాయమూర్తి ఈ నెల 28న శనివారం సాయంత్రం 5:30 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకొని రాత్రి బస చేసి మరుసటి దినం సెప్టెంబర్29న ఆదివారం ఉదయం 8:15 గంటలకు తిరుమల చేరుకొని, తిరుమల శ్రీవారిని దర్శించుకొని తిరుమల నుండి బయలుదేరి తిరుపతి చేరుకొని స్వల్ప విశ్రాంతి అనంతరం మద్యాహ్నం 2:35 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుండి తిరుగు ప్రయాణం కానున్నారని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News