Breaking News

రేపు తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం

-సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనున్న టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అక్టోబర్ 26 నుండి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా ప్రారంభమవుతుంది. టీడీపీ కేంద్ర కార్యాలయం లో పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో రూ.లక్ష రూపాయలు కట్టిన వారికి టీడీపీ నుండి శాశ్వత సభ్యత్వం అందించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రికార్డు స్థాయిలో నిర్వహించాలి. కేవలం రూ.100తో పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి ప్రమాద బీమా రూ.5 లక్షలు అమలు కానుంది. గతంలో ప్రమాద బీమా రూ.2లక్షలు ఉండగా దాన్ని రూ.5లక్షలకు పెంచాం. సభ్యత్వం కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి చనిపోయిన రోజే అంత్యక్రియలకు రూ.10,000 అందించబడుతుంది. వారి కుటుంబ సభ్యులకు విద్య, వైద్యం, ఉపాధి కోసం తెలుగుదేశం పార్టీ సాయం అందిస్తుంది.

Check Also

విద్యుత్‌ చార్జీల భారాన్ని ప్రభుత్వమే భరించాలి

-లేకుంటే వామపక్షాలతో కలిసి ఉద్యమిస్తాం -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *