Breaking News

All News

రూ.2.73 కోట్ల అభివృద్ధి ప‌నులు ప్రారంభం, శంకుస్థాప‌న‌లు

-గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధికి పూర్తి సహకారం -ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ గిద్దలూరు, నేటి పత్రిక ప్రజావార్త : గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో స‌హ‌క‌రిస్తాన‌ని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ హామీ ఇచ్చారు. శుక్ర‌వారం నాడు మంత్రి గొట్టిపాటి రవి కుమార్, స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తో పాటు మార్కాపురం జిల్లా గిద్దలూరులో ప‌ర్య‌టించారు. ఇందులో భాగంగా గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గంలో వివిధ ప్రారంభోత్స‌వాలు, శంకుస్థాప‌న కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. ముందుగా మార్కాపురం జిల్లాలో ఒంగోలు – నంద్యాల రోడ్డు …

Read More »

శ్రీవారి నైవేద్యం కల్తీపై జగన్ బ్యాచ్ సమాధానం చెప్పాలి

– దోషులకు కఠిన శిక్ష తప్పదు – ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు, డా. పసుపులేటి హరిప్రసాద్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీవారి నైవేద్యంలో నెయ్యి కల్తీ జరిగిందన్న అంశంపై తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొని తీవ్రంగా స్పందించారు. తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు మాట్లాడుతూ — శ్రీవేంకటేశ్వర …

Read More »

ఘనంగా అరగొండ అర్థగిరి శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకరణ మహోత్సవం

చిత్తూరు, నేటి పత్రిక ప్రజావార్త : చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండలం అరగొండ అర్థగిరి శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకరణ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి పూతలపట్టు నియోజకవర్గం శాసన సభ్యులు డాక్టర్ కలికిరి మురళి మోహన్ , ఆంధ్రప్రదేశ్ హస్తకళా అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్‌గా రఘుపతి , మెంబర్‌గా రాధిక మరియు మరో 8 మంది సభ్యులు …

Read More »

‘శిక్షాగ్రహ లీడర్ షిప్ అవార్డు’ అందుకున్న నెల్లూరు జిల్లా సైన్స్ సెంటర్ క్యూరేటర్ సుబ్రహ్మణ్యం

-దేశవ్యాప్తంగా 6,500 మంది ఉపాధ్యాయులకు.. ముగ్గురు ఎంపిక… వారిలో సుబ్రహ్మణ్యం ఒకరు. -విజేతలకు 10 లక్షల రూపాయల నగదు పురస్కారం అందించిన శిక్షాలోకం సంస్థ. -సుబ్రహ్మణ్యం కృషికి తోడు… సమగ్ర శిక్ష ఎస్పీడీ బి. శ్రీనివాసరావు IAS ప్రోత్సాహం, ఆర్థిక చేయూత విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ప్రాంతాల్లో సైన్స్ విద్యను ప్రజలకు చేరువ చేస్తూ మూడు దశాబ్దాలుగా అంకితభావంతో పనిచేస్తున్న నెల్లూరు జిల్లా సైన్స్ సెంటర్ క్యూరేటర్ ఎన్. సుబ్రహ్మణ్యం కి జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన “శిక్షాగ్రహ లీడర్‌షిప్ అవార్డు” …

Read More »

సోషల్ మీడియా ద్వారా స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాలకు విస్తృత ప్రచారం

-సోషల్ మీడియా ఇన్ఫ్లియన్సర్లకు పట్టాభిరామ్ పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సోషల్ మీడియా ఇన్ఫ్లియన్సర్లు అందరూ స్వచ్ఛ సేవకులుగా మారి సోషల్ మీడియా ద్వారా స్వచ్ఛాంధ్ర-స్వర్ణ అంధ్ర కార్యక్రమాలకు విస్తృత ప్రచారం కల్పించాలని స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పిలుపు ఇచ్చారు. విజయవాడలోని పార్క్ ఎన్ హోటల్ లో ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్(ఏఐఐఎల్ఎస్‌జీ), స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ తో కలిసి శుక్రవారం సోషల్ మీడియా ఇన్ఫ్లియన్సర్లకు నిర్వహించిన అవగాహనా సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా …

Read More »

సాగు నీటి సంఘాలు చేసే పనులకు జీఎస్టీ మినహాయింపు

-సాగునీటి సంఘాల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతీ ఎకరాకు సాగు నీరు అందేలా సాగునీటి సంఘాలు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. సాగు నీటి సంఘాలు చేసే పనులకు జీఎస్టీ లేకుండా చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఒకప్పుడు రైతు ఆత్మహత్యలకు కేంద్రంగా ఉన్న ఏపీని సమర్థ పాలన, నిర్దిష్ట ప్రణాళికలతో రైతు సానుకూల రాష్ట్రంగా మార్చామని స్పష్టం చేశారు. గురువారం అమరావతిలోని నేలపాడు వద్ద ఉన్న పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన నీరు-ప్రగతి, …

Read More »

అసంఘటిత కార్మికులకు సంక్షేమ పథకాల పునరుద్ధరణ

-కార్మికులకు ఆధునిక నైపుణ్యాల్లో శిక్షణ -సంజీవనితో అనుసంధానించి వైద్య పరీక్షలు -కార్మిక శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అసంఘటిత రంగంలో ఉన్న భవన నిర్మాణ, ఇతర కార్మికులకు గతంలో అందించిన సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రసూతికి రూ.20 వేలు, వివాహానికి రూ.40 వేలు, సహజ మరణానికి రూ.60 వేలు, అంత్యక్రియలకు రూ.20 వేల మేర ఆర్ధిక సాయం అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. క్యాంపు …

Read More »

ఎమ్మిగనూరులో రేపు సీఎం చంద్రబాబు పర్యటన

-మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం పర్యటించనున్నారు. కలుగట్లలో జరిగే మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో భాగంగా నిర్వ.హించే పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో పాల్గొంటారు. శుక్రవారం ఉదయం క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరి 11.30 గంటలకు కలుగట్ల చేరుకుంటారు. గ్రామసభలో పాస్ పుస్తకాల పంపిణీ అనంతరం, ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడతారు. అనంతరం వ్యవసాయ క్షేత్రంలో పర్యటించి మధ్యాహ్నం 2 గంటలకు …

Read More »

భారతీయ జ్ఞాన పరంపర..తెలుగు సాహిత్యం… మొదటి సదస్సు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్టెల్లా కళాశాల లో తెలుగు శాఖ మరియు ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం నెల్లూరు వారు సంయుక్తం గా రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు ఫిబ్రవరి 5 వ తేదీన ఘనంగా ప్రారంభించారు. ఈ రెండురోజుల అంతర్జాతీయ సదస్సుకు ఆచార్య వేలుదండ నిత్యానంద రావు వైస్ ఛాన్సలర్ సురవరం ప్రతాప రెడ్డి యూనివర్సిటీ,ఆచార్య కొప్పుల విక్టర్ బాబు వైస్ ఛాన్సలర్ ప్రిన్ కాన్సర్ యూనివర్సిటీ, సౌత్ అమెరికా ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ తెలుగు విశిష్ట …

Read More »

పాఠశాలల్లో విద్యార్థుల భద్రత, రక్షణే మా ప్రథమ ప్రాధాన్యత – ఎస్.సి.ఇ.ఆర్.టి డైరెక్టర్ ఎం.వి. కృష్ణారెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో ‘పాఠశాలల భద్రత రక్షణ’ అంశంపై ఈరోజు రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించారు. ఎస్.సి.ఇ.ఆర్.టి (SCERT) డైరెక్టర్ ఎం.వి. కృష్ణారెడ్డి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల్లో సమగ్ర వికాసాన్ని పెంపొందించాలన్నారు. పాఠశాల వాతావరణం ఆనందదాయకంగా, సురక్షితంగా ఉన్నప్పుడే పిల్లలు ఉత్సాహంగా చదువుకోగలరని, జాతీయ విద్యా విధానం (NEP) 2020 ప్రకారం, గ్రామీణ ప్రాంత విద్యార్థులు మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ప్రపంచ స్థాయి పోటీని తట్టుకునేలా సిద్ధం …

Read More »