తుని, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరిజిల్లా తునిమండలం లోవకోత్తూరులో గల లలిత స్వరూపమైన శ్రీ తలుపులమ్మ అమ్మవారు ఆషాడమాసం సందర్భంగా శాకాంబరీ అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారు మూలవిరాట్ ను పలురకాల కూరగాయలు ఆకుకూరలతో అందంగా అలంకరించారు. అలాగే అమ్మవారి పంచలోహ విగ్రహాల వద్ద భారీ ఆకుకూరలతో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో క్షేత్రానికి భక్తులు చేరుకుని అమ్మవారిని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందం పొందారు. మరోపక్క ఆషాడ ఆదివారం కావడంతో …
Read More »Devotional
జులై 28న తిరుమలలో పల్లవోత్సవం…
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమలలో జులై 28వ తేదీ బుధవారం పల్లవోత్సవం జరుగనుంది. ఇందులో భాగంగా సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేస్తారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పిస్తారు. మైసూరు మహారాజు జ్ఞాపకార్థం దాదాపు 300 సంవత్సరాల నుండి పల్లవోత్సవాన్ని టిటిడి నిర్వహిస్తోంది. మొదట్లో ఈ ఉత్సవాన్ని తోటోత్సవం అనేవారు. …
Read More »ఆషాడ శోభతో శ్రీ శ్రీ శ్రీ తలుపులమ్మ క్షేత్రం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవత శ్రీ శ్రీ శ్రీ తలుపులమ్మ క్షేత్రం ఆషాడ శోభతో ప్రకాశిస్తుంది. అషాడ ఆదివారం కావడంతో తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో క్షేత్రానికి భక్తులు చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ముందుగా అమ్మవారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం కావడంతో అమ్మవారి మూలవిరాట్టుకు పంచామృత అభిషేకాలు ఏకాంతంగా అర్చకులు నిర్వహించారు అనంతరం కొండ దిగువన పంచలోహ విగ్రహాల వద్ద ఆషాడమాస పూజల్లో భాగంగా కుంకుమ పూజ కార్యక్రమాలు నయన మనోహరంగా నిర్వహించారు. ఈ …
Read More »శ్రీ దుర్గమ్మ వారికి తెలంగాణ బంగారు బోనం సమర్పణ…
విజయవాడ (ఇంద్రకీలాద్రి), నేటి పత్రిక ప్రజావార్త : ఆషాడ మాసం సందర్భముగా శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, శ్రీ కనకదుర్గ అమ్మవారికి ప్రతి సంవత్సరము వలే ఈ ఏడాది కూడా తెలంగాణా రాష్ట్రం, హైదరాబాద్ భాగ్య నగర్ శ్రీ మహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ వారు ఆదివారం శ్రీ అమ్మవారికి బంగారు భోణం సమర్పించుటకు విచ్చేయగా బ్రాహ్మణ వీధి లోని జమ్మిదొడ్డి వద్ద దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఆలయ కార్యనిర్వహణాధికారి డి.భ్రమరాంబ, ఆలయ పాలకమండలి చైర్మన్ …
Read More »శబరిమలలో 17 నుంచి అయ్యప్ప దర్శనం…
తిరువనంతపురం, నేటి పత్రిక ప్రజావార్త : కేరళలోని శబరిమల అయ్యప్ప దేవస్థానాన్ని ఈ నెల 17 నుంచి భక్తుల కోసం తెరవనున్నారు. జులై 21 వరకు జరిగే పూజా కార్యక్రమాల కోసం ఈ అవకాశం కల్పించనున్నారు. కరోనా వ్యాక్సిన్ పొందినట్లు ధ్రువపత్రం, ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ రిపోర్టు ఉన్నవారికే ప్రవేశం ఉంటుందని దేవస్థానం బోర్డు స్పష్టంచేసింది. ఆన్లైన్ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని, 5 వేల మందికి మాత్రమే దర్శన అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు.
Read More »ఆషాఢమాసం… శ్రీ వారాహి నవరాత్రులు…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు గల తిథుల రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు.వీటిని గుప్తనవరాత్రులు అంటారు. అమ్మవారి వైభవం గురించి కొంత… మనకు శ్రీ విద్యా సంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. వారాహి దేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని..లలిత యొక్క రధ, గజ, తురగ, సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి…అందుకే ఆవిడను దండనాథ అన్నారు. లలితా …
Read More »మీమల్ని మీరు అన్ని రకాల ప్రయోగాల నుండి రక్షించుకునే సుదర్శన మంత్రం…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఎటువంటి బాధలు తొలగించబడతాయో ఈ శ్లోకంలో వివరంగా ఉంది అటువంటి బాధలు అనుభవిస్తున్న వారు ఈ శ్లోకాన్ని ప్రతిరోజు 108 సార్లు మీ సమస్యలు తీరే వరకు రోజూ చదవాలి తగిన పరిష్కరం చూపిస్తుంది సమస్య నుండి విముక్తి పొందుతారు. ఇది బాధ అనుభవిస్తున్న వారు చేస్తే త్వరగా ఫలితం ఉంటుంది చదవలేని పరిస్థితి ఉన్న వారు 108 సార్లు మనసు లగ్నం చేసి ఆడియో విన్నా పర్వాలేదు కానీ జపించడం వల్ల మీకు మోనో ధైర్యం …
Read More »అమ్మను పూజిద్దాం …
–‘తల్లి ప్రేమ అనిర్వచనీయం…’ కొండూరి శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయుడు, నేటి పత్రిక ప్రజావార్త, ఎడిటర్. అమ్మలో బ్రహ్మ అంశ, విష్ణు అంశ, పరమశివుడి అంశ, ఈ మూడు అంశాలు ప్రచోదనమయి వుంటాయి. జీవితాంతం నిబడి ఉంటాయి. కాబట్టే అమ్మ తన కన్నబిడ్డకు పరదేవతే-పరబ్రహ్మమే. అమ్మకు చేసిన నమస్కారం పరబ్రహ్మానికి చేసిన నమస్కారమే. అమ్మకు చేసిన ప్రదక్షిణం పరబ్రహ్మానికి చేసిన ప్రదక్షిణమే. అమ్మ తనకు తాను ఉద్ధారకురాలు కాకపోవచ్చు. 95 ఏళ్ళ ముసలివగ్గయినా, తన అన్నం తాను తిన్నదో లేదో గుర్తు లేకపోయినా, తనకంటూ తాను …
Read More »ఇలలో పరమ పవిత్ర క్షేత్రం శ్రీకాళహస్తి
-శ్రీకాళహస్తి ఆలయ ప్రత్యేకతలు తెలిస్తే…తప్పక దర్శించుకోవాలనుకుంటారు… అమరావతి, నేటి పత్రిక ప్రజా వార్త : ఈ క్షేత్రంలో ఆలయంలోకి వెళ్లకుండానే కైలాసగిరుల ప్రదక్షిణ చేస్తే పరమశివుని దర్శించుకున్నట్లే. దక్షిణ కాశీలు చాలా ఉన్నాయి. దక్షిణ కైలాసం మాత్రం ఒక్కటే ఉంది.’ అంటారు ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు. కైలాసగిరుల ప్రదక్షిణ కోసం ఆయన శ్రీకాళహస్తికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన శ్రీకాళహస్తి క్షేత్రమహాత్యం గురించి వివరించారు. ఆ విశేషాలివీ… శ్రీకాళహస్తి వాయులింగ క్షేత్రం. వాయువు అంటే ప్రాణం. వాయువు ఉంటేనే ప్రాణం ఉంటుంది. …
Read More »శ్రీ ఆంజనేయస్వామి వారి జన్మస్థలం అంజనాద్రి
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ ఆంజనేయస్వామి వారి జన్మస్థలం అంజనాద్రి అని పౌరాణిక, వాఙ్మయ, శాసన, భౌగోళిక ప్రమాణాలతో టిటిడి నిరూపించింది. ఈ మేరకు పండితుల కమిటీ తయారుచేసిన నివేదికను శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆవిష్కరించారు. కార్యక్రమానికి విచ్చేసిన తమిళనాడు గవర్నర్ భన్వారిలాల్ పురోహిత్ మాట్లాడుతూ శ్రీరాముని జన్మస్థానం అయోధ్య అని, ఇకపై రామ భక్తుడైన హనుమంతుని జన్మస్థానం తిరుమల అన్నారు. టిటిడి ఈ విషయాన్ని శాస్త్రబద్ధంగా నిరూపించిందన్నారు. తాను హనుమంతుడి భక్తుడినని, ఈ విషయం …
Read More »
Prajavartha Online Telugu News