Breaking News

Daily Archives: July 10, 2024

సీఎం చంద్రబాబు నాయుడుతో బిపీసీఎల్, విన్ ఫాస్ట్ కంపెనీ ప్రతినిధుల భేటీ

-రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ఏపీ అత్యుత్తమ గమ్యస్థానం అని సిఎం చంద్రబాబునాయుడు అన్నారు. సచివాలయంలో బిపీసీఎల్, విన్ ఫాస్ట్ సంస్థల ప్రతినిధులతో బుధవారం సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించారు. రాష్ట్రంలో ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుపై బిపీసీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్, సంస్థ ప్రతినిధులతో చర్చించారు. ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చితే దాదాపు రూ.60 వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం …

Read More »

రాష్ట్రంలో రూ. 75వేల కోట్ల పెట్టుబ‌డులు పెట్టేందుకు బీపీసీఎల్ సిద్ధం.. రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్

-ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో స‌మావేశ‌మైన భార‌త్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ ప్ర‌తినిధులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో భారీగా పెట్టుబ‌డులు పెట్టేందుకు భార‌త్ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్ కంపెనీ సిద్ధంగా ఉన్నట్టు కంపెనీ ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో చెప్పారని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ తెలిపారు. సచివాల‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుతో బీపీసీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్, సంస్థ ప్రతినిధులు స‌మావేశ‌మైన‌ట్లు మంత్రి చెప్పారు. పరిశ్రమల శాఖ మంత్రిగా ఈ కంపెనీ …

Read More »

ఏపీలో రూ. 4 వేల కోట్ల‌ పెట్టుబడులకు విన్ ఫాస్ట్ ఆసక్తి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌పంచంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో పేరున్న విన్ ఫాస్ట్ సంస్థ ఏపీలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు సీఎం చంద్రబాబుతో చెప్పారని రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భ‌ర‌త్ పేర్కొన్నారు. స‌చివాల‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుతో క‌లిసి విన్ ఫాస్ట్ సంస్థ సీఈవో పామ్ సాన్ చౌ, సంస్థ ప్రతినిథులు స‌మావేశ‌మైన‌ట్లు మంత్రి టి.జి తెలిపారు. పరిశ్రమల శాఖ మంత్రిగా ఈ కంపెనీ ప్రతినిధులను ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేయడంలో తన …

Read More »

కాలుష్య నియంత్రణ మండలిని ప్రజలకు చేరువ చేయండి

– ప్రతి రోజు ప్రజలు తమ సమస్యలు తెలియచేసేందుకు రెండు గంటలు సమయం ఇవ్వాలి – ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిని ప్రజలకు చేరువ చేయాలని అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మండలి అధికారులకు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ప్రజలు కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయాలకు వెళ్ళి తమ సమస్యలు తెలియచేసేందుకు, ఫిర్యాదులు ఇచ్చేందుకు ప్రతి రోజు రెండు గంటల …

Read More »

అంతర్జాతీయ ప్రమాణాలతో జూ పార్కుల అభివృద్ధి

-పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన -అరుదైన జంతువుల దిగుమతి, ప్రదర్శనపై దృష్టి -కొత్త జూ పార్కుల ఏర్పాటుకు నివేదికలు రూపొందించండి -జూ పార్కుల అభివృద్ధిలో కార్పొరేట్లను భాగస్వాముల్ని చేయండి -కార్పొరేట్ సంస్థలను ఆకర్షించేందుకు ఉప ముఖ్యమంత్రితో తేనీటి సేవనం(టీ విత్ డిప్యూటీ సీఎం) కార్యక్రమం -జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 14వ గవర్నింగ్ బాడీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీశాఖ మంత్రి  పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో జంతు ప్రదర్శనశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని …

Read More »

హజ్ యాత్రికులకు ఘన స్వాగతం పలికిన మంత్రి ఫరూక్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హజ్ యాత్రను ముగించుకొని ఆంధ్రప్రదేశ్ కు తిరిగి వచ్చిన హజ్ యాత్రికులను గన్నవరం ఎయిర్పోర్ట్ నందు వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ హాజయాత్రికులకు ఎటువంటి కష్టం రాకుండా ఎటువంటి ఆటంకాలు రాకుండా వారికి కావాల్సిన సౌకర్యాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు . ఈరోజు హజ్ యాత్రను ముగించుకొని విజయవంతంగా తిరిగి వచ్చిన …

Read More »

పెండింగ్ మెస్ చార్జీలు విడుదల చేస్తాం

-వసతి గృహాల్లో ఖాళీలు త్వరలో భర్తీచేస్తాం -రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలకు పెండింగ్ బకాయిలు త్వరలో విడుదల చేస్తామని,వసతి గృహాల్లో ఖాళీలు భర్తీ చేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు.వెలగపూడిలోని సచివాలయంలో మూడవ రోజు మంత్రి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఎస్.ఎఫ్.ఐ విద్యార్ది సంఘ నాయకులు,సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ సభ్యులు …

Read More »

నేటి నుంచి (గురువారం) రైతు బజార్ల ద్వారా సబ్సిడీ పై బియ్యం అందుబాటులొ…

– కలెక్టర్ పి ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : కందిపప్పు, బియ్యం ధరల నియంత్రణా చర్యల్లో భాగంగా గురువారం నుంచి రైతు బజార్ల ద్వారా సబ్సిడీ పై వినియోగ దారులకు అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా ధరల నిర్ణయ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఇటీవల కాలంలో నిత్యావసర వస్తువు లైన బియ్యం, కంది పప్పు బహిరంగ …

Read More »

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి పీహెచ్‌సీ కూడా 3 షిఫ్టులతో 24/7 నడపాలి

-పిహేచ్ సీ వైద్యులు, వైద్య సిబ్బంది ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పని వేళల్లో తప్పనిసరిగా పీహెచ్‌సీలో అందుబాటులో ఉండాలి -నైట్ డ్యూటిలో రాత్రి 8 గం.. నుంచి ఉదయం 8 గం వరకు స్టాఫ్ నర్సు కి తోడుగా నైట్ వాచ్మెన్. విధులు నిర్వహించాలి. -ఎవరైనా కంప్లైంట్ చేస్తే. DDO చర్యలు తీసుకోవాలి -జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులు వైద్య సిబ్బంది 24/7 ప్రజా ఆరోగ్య …

Read More »

మానసిక చికిత్స కేంద్రాన్ని సందర్శన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రకాష్ బాబు రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలోని మానసిక చికిత్స కేంద్రాన్ని సందర్శించారు. ఈ విభాగంలో చికిత్స పొందుతున్న వారి వివరాలు, వారికి అందుతున్న వైద్య సదుపాయాలు మరియు ఇతర వివరాలను గురించి సదరు అధికారులను అడిగి తెలుసుకున్నారు. మానసిక రుగ్మతల నుండి పూర్తిగా ఉపశమనం పొందిన వారిని తిరిగి వారి కుటుంబ సభ్యులతో కలిపేందుకు తగు చర్యలు తీసుకోవాలని, …

Read More »