Breaking News

Daily Archives: July 27, 2024

వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం కాకాని తరుణ్ చేస్తున్న కృషి అభినందనీయం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఫర్నీచర్‌ అందించడంతోపాటు కన్స్యూమర్ కోర్ట్ బిల్డింగ్ బాగుచేతకు మూడు లక్షల నిధుల మంజూరు కోసం నిరంతరం కృషి చేసినందుకు గానూ వినియోగదారుల అవగాహన ఫౌండేషన్‌ అధ్యక్షుడు, ఎన్టీఆర్‌ జిల్లా వినియోగదారుల పరిరక్షణ మండలి సభ్యులు డాక్టర్‌ తరుణ్‌ కాకానిని ‌ ఏపీ రాష్ట్ర వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార కమిషన్ అధ్యక్షులు దొమ్మేటి శ్రీనివాస్‌, ఎన్టీఆర్ జిల్లా వినియోగదారుల కమీషన్ అధ్యక్షులు నేలపూడి చిరంజీవి, సభ్యులు A రమణ సత్కరించారు. శ‌నివారం విజయవాడ వినియోగదారుల కమీషన్ లో నూతన …

Read More »

కె.డి.సి.ఎ ప్ర‌మాణాల‌ను ప‌రిశీలించిన ఎంపి కేశినేని శివ‌నాథ్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేష‌న్ (కె.డి.సి.ఎ) లో క్రికెట్ నేర్చుకునే క్రికెటర్స్ మ‌రింతగా రాణించేందుకు అవ‌స‌ర‌మైన అంతర్జాతీయ ప్ర‌మాణాలు క‌ల్పిస్తాన‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. ఇందిరా గాంధీ మున్సిప‌ల్ స్టేడియంలోని కృష్ణ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేష‌న్ ను ఎంపి కేశినేని శివ‌నాథ్ శ‌నివారం సంద‌ర్శించారు. ఎంపి కేశినేని శివనాథ్ ను అసోసియేష‌న్ స‌భ్యులు శాలువాతో స‌త్క‌రించారు. అసోసియేష‌న్ పిల్ల‌ల‌తో స‌ర‌దాగా కాసేపు టేబుల్ టెన్నిస్ ఆడారు.అనంత‌రం క్రీడాకారుల‌తో కాసేపు మాట్లాడి క్రికెట్ లో నైపుణ్యం …

Read More »

నామినేటెడ్ పదవుల్లో బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి మ్యానిఫెస్టోలో బ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యత కల్పించారు వాటిని వెంటనే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు సత్యవాడ.దుర్గాప్రసాద్, కార్యదర్శి కోసూరు సతీష్ శర్మ ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు. కూటమి అధికారంలోకి రావటానికి బ్రాహ్మణులు ముఖ్య భూమిక పోషించారన్నారు, రాబోయే నామినేటెడ్ పదవుల్లో బ్రాహ్మణులకు సముచిత స్థానం కల్పించాలని కోరారు. విజయవాడ లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడుతూ అన్ని రంగాల్లో బ్రాహ్మణులు వెనుకబడిపోయారని తెలిపారు. దేవాలయ పాలక …

Read More »

పునరాస కేంద్రం చందా సత్రం లో ఉన్న వరద బాదితులను  పరామర్శించి..

-25 కిలోల బియ్యం నిత్యవసర సరుకులను పంపిణీ చేసిన.. -సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి  వాసు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : భారీ వర్షాలు వరదలు కారణంగా  గోదావరి ఉదృతికి బ్రిడ్జిపేట వాసులను పునరాస కేంద్రాలకు తరలించి వారికి రు. 3 వేల రూపాయలతో పాటు బియ్యం, నిత్యవసర సరుకులు పంపిణీ చేశామని సిటీ  శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు అన్నారు. శనివారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి వారి ఆలయం దగ్గరలో వున్న చందా సత్రం పునరావాస  కేంద్రంలోని  గోదావరి …

Read More »

ఈ నెల 28 నుండి ఆగస్ట్ 2 వరకు నిర్వహించనున్న ఎపిపియస్సి డిపార్ట్మెంటల్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

-తిరుపతి జిల్లాలో 2 పరీక్ష కేంద్రాలు -హాజరుకానున్న 3142 అభ్యర్థులు : స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామ్మోహన్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 28 నుండి ఆగస్టు నెల 2 వ తేదీ వరకు జిల్లాలో జరగనున్న ఎపిపియస్సి డిపార్ట్మెంటల్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రామ్మోహన్ పేర్కొన్నారు. శనివారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ నందు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అధికారులతో రేపటి నుండి జరగనున్న ఎపిపియస్సి డిపార్ట్మెంటల్ పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించి …

Read More »

కృత్రిమ కాళ్ళను తయారుచేసి రెండు నెలల వ్యవధి లోపల పంపిణీ…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి జిల్లాలోని విభిన్న ప్రతిభావంతుల కొరకు శనివారం పుట్టుకతో దివ్యాంగులుగా మారటం, వివిధ ప్రమాదాల్లో కాళ్లు పోగొట్టుకోవడం మరియు ఇతర రోగాల దృష్ట్యా కాళ్లు తొలగించడం తదితర కారణాలతో పలువురు కాళ్లు కోల్పోయి నడవలేని వారికి కృత్రిమ కాలు అమర్చుటకు జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ వారు ఫ్రీడమ్ ట్రస్ట్ మరియు హుండాయ్ ట్రాన్సిస్ లీయర్ ఆటోమోటివ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో రాస్ ప్రధాన కార్యాలయం నందు 166 మంది విభిన్న ప్రతిభవంతులను …

Read More »

నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు, పరిశ్రమల్లో యువతకు మెరుగైన ఉపాధి కల్పించుటకు పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలి

-పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు సక్రమంగా అమలు అయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి -2024-25 ఆర్థిక సంవత్సరానికి పీఎంఈజిపి లక్ష్యాల మేరకు మంజూరు, గ్రౌండింగ్ కు చర్యలు చేపట్టాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తోందని, నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు, పరిశ్రమల్లో యువతకు మెరుగైన ఉపాధి కల్పించేలా పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలనీ, పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు సక్రమంగా అమలు అయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని …

Read More »

తిరుపతి, రాయలసీమ జిల్లాలకు మెరుగైన ఉత్తమ పాస్‌పోర్ట్ సేవలు అందిస్తున్నందుకు సంతోషిస్తున్నాం

-ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారి శివ హర్ష తిరుపతి, జూలై 27 : తిరుపతి మరియు రాయలసీమ జిల్లాలకు మెరుగైన పాస్‌పోర్ట్ సేవలు అందిస్తున్నందుకు సంతోషిస్తున్నాము అని ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారి శివ హర్ష శనివారం తిరుపతి లోని, ఎయిర్ బైపాస్ రోడ్డు వద్ద ఉన్న పాస్ పోర్ట్ సేవా కేంద్రం లో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ అన్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారి మాట్లాడుతూ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం, విజయవాడ, రాయలసీమ జిల్లాలను కవర్ చేస్తూ తిరుపతి …

Read More »

జూలై మాసపు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ లు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దకే పంపిణీ

-ఆగస్ట్ 1వ తేదీన పెన్షన్ లబ్ధిదారులు ఇంటి వద్ద అందుబాటులో ఉండాలి -జిల్లాలో 2,67,772 మంది లబ్దిదారులకు సుమారు రూ.113.17 కోట్లు పంపిణీకి చర్యలు: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త : జూలై మాసపు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ లు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దనే ఆగస్ట్ 1న ఉదయం 6 గం. నుండి పంపిణీ చేయనున్నట్లు మరియు సాంకేతిక కారణాలవలన మిగిలిపోయిన వారికి 2వ తేదీలో పంపిణీ చేయనున్నట్లు తెలుపుతూ లబ్ధిదారులు1వ …

Read More »

ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగుల సంఘం నుంచి అధ్యక్షుడిగా కె.ఆర్‌.ని బహిష్కరించాం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ)లో చీలిక ఏర్పడిరది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నుంచి కె.ఆర్‌.సూర్యనారాయణను బహిష్కరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి ఆస్కార్‌రావు వెల్లడించారు. ఈ మేరకు ఆయన గాంధీనగర్‌ ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని సుబ్బరాయన్‌ 2010లో ఏర్పాటు చేశారని, తరువాత సూర్యనారాయణ సంఘాన్ని తన చేతుల్లోకి తీసుకుని వ్యవస్థాపకులనే బయటకు తోసివేశారని అరోపించారు. కేె.ఆర్‌.సూర్యనారాయణ తమ అసోసియేషన్‌లో నిబంధనలు ఉల్లంఘించి …

Read More »