మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వైద్యవృత్తి ఎంతో పవిత్రమైనదని, రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వైద్య చికిత్సలు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ వైద్యాధికారికి సూచించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఉంగుటూరు మండలంలోని పెద్దఔటుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆరోగ్య కేంద్రంలోని మందులు, ఓపి రిజిస్టరు, ప్రయోగశాల పరిశీలించి కేంద్రంలో చేస్తున్న 63 రకాల పరీక్షలు, పాము కాటు, కుక్క కాటులకు అవసరమైన మందులు ఉన్నాయా లేదా వివరాలను …
Read More »Monthly Archives: July 2024
ఉచిత ఇసుక విధానం అమలుకు చర్యలు .. జాయింట్ కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన ఛాంబర్ లో గనులు, రవాణ, ఇరిగేషన్, ఏస్ఈబి, ఆర్డీవోలు, ఇతర అధికారులతో జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలకు తీసుకోవాల్సిన చర్యలపై ఆమె చర్చించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక విధానాన్ని ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో పటిష్టంగా అమలు చేయాలన్నారు. గనులు, …
Read More »ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కె.బి.ఆర్ గవర్నమెంట్ ఐ.టి.ఐ, గుడివాడ, కృష్ణ జిల్లా ఆవరణలో 08-07-2024 సోమవారము ఉదయం 9.00 గంటలకు ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళ నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ ఎల్ గౌరిమణి తెలియచేసిన్నారు. ఈ ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ మేళ కు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరై అభ్యర్ధులను అప్రెంటిస్ లో చేర్చుకోవడానికి ఇంటర్వ్యూ నిర్వహించారని తెలిపారు. మొత్తం 67 మంది హాజరు కాగా వారిలో 42 మంది అప్రెంటిస్ లుగా ఎంపిక చేసికున్నారు. ఈ కార్యక్రమము లో కళాశాల ప్రిన్సిపాల్ …
Read More »జిల్లాలో “స్టాప్ డయేరియా” క్యాంపెయిన్ నిర్వహణపై సమీక్ష
-పైప్ లైన్ లీకేజీలు గుర్తిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలి -కాచి చల్లార్చిన నీటిని త్రాగాలి -జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో జూలై 1 నుంచి చేపట్టిన స్టాప్ డయేరియా క్యాంపెయిన్ పటిష్టవంతంగా నిర్వహించాలని, జిల్లాలో ఎక్కడా డయేరియా కేసులు రాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సోమవారం కలెక్టరేట్ లో మున్సిపల్ కమిషనర్లు, వైద్య, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, ఐసిడిఎస్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి డయేరియా నియంత్రణ కార్యక్రమం స్టాప్ …
Read More »ప్రజల సమస్యలు సకాలంలో పరిష్కరించాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల సమస్యల పట్ల అత్యధిక వాదాన్ని తెచ్చి ప్రాధాన్యత నిచ్చి సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా కలెక్టర్ సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ డిఆర్ఓ కే చంద్రశేఖర రావు కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ ప్రాంతాల …
Read More »పనుల జాబితాను సిద్ధం చేసి వచ్చే వారంలోగా అందజేయాలి…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో సి ఎస్ ఆర్ (కార్పొరేట్ సామాజిక బాధ్యతా) నిధులు సద్వినియోగం కోసం అవసరమైన పనుల జాబితాను సిద్ధం చేసి వచ్చే వారంలోగా అందజేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ మీకోసం కార్యక్రమానికి ముందు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి సిఎస్ఆర్ నిధుల వినియోగం, కోర్టు కేసుల పరిష్కారం, ఉద్యోగుల పారిశ్రామికవేత్తల సమస్యల పరిష్కారం, యోగ నిర్వహణ తదితర అంశాలపై దిశా నిర్దేశం చేశారు …
Read More »పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టంలో ప్రజా ఫిర్యాదులకు సంతృప్తికర పరిష్కారాలు అందించండి
-ఇన్ఛార్జ్ కమిషనర్ అధికారులకు ఆదేశాలు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గలసోమవారం ఉదయం ఇన్ఛార్జ్ కమాండర్ కంట్రోల్ రూమ్ నందు నగర ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం (ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక), ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్, వివిధ శాఖాధిపతుల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు సమస్యలు త్వరగా పరిష్కరించేందుకు ఇదొక మంచి అవకాశం అని ప్రతి సోమవారం ప్రధాన కార్యాలయం మరియు జోనల్ కార్యాలయాల్లో …
Read More »పిఠాపురం, భీమవరం నియోజక వర్గాల్లో వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక ప్రణాళిక
-స్థానిక సంస్థలతోపాటు ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం -ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రోజు రోజుకీ పెరుగుతున్న ఘన, ద్రవ వ్యర్థాల మూలంగా గ్రామాల్లో సైతం పర్యావరణ సమస్యలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు తీవ్రమవుతాయనీ.. శాస్త్రీయ విధానంతో వ్యర్థాల నిర్వహణ చేపట్టేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా స్థానిక సంస్థలతో కలసి స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు పని చేసే విధంగా ఒక కార్యాచరణ రూపొందించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి …
Read More »తెలుగుజాతి ఉన్నంత వరకు టీడీపీ ఉంటుంది
-తెలంగాణ గడ్డపై టీడీపీకి పూర్వవైభవం తీసుకొస్తాం -హైదరాబాద్ లో టీడీపీ చేసిన అభివృద్ధిని తర్వాతి ప్రభుత్వాలు కొనసాగించాయి -తెలుగు రాష్ట్రాలు రెండు పరస్పరం సహకరించుకుని అభివృద్ధి చెందాలి -గొడవలతో కాదు చర్చలతో విభజన సమస్యలు పరిష్కారం కావాలి -ఏపీని విధ్వంసం చేసిన భూతాన్ని పూర్తిగా భూస్థాపితం చేస్తాం -మరొక జన్మంటూ ఉంటే తెలుగు గడ్డపైనే పుడతా -టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు -ముఖ్యమంత్రిగా నాలుగో సారి బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఎన్టీఆర్ భవన్ కు చంద్రబాబు -చంద్రబాబుకు ఘన స్వాగతం …
Read More »సోమవారం ప్రజా ఫిర్యాదులు స్వీకరణ
-ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి -జిల్లా కలెక్టర్ డా.జి.సృజన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జూలై 8 వ వ తేదీ సోమవారం కలెక్టరేట్ లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి. సృజన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్) ద్వారా చేపట్టనున్నట్టు తెలిపారు. *కలెక్టరేట్, డివిజన్, …
Read More »