Breaking News

Daily Archives: September 1, 2024

ప్రశాంత వాతావరణంలో ముగిసిన యూపీఎస్సీ నేషనల్ డిఫెన్స్ అకాడెమీ & నావల్ అకాడెమీ మరియు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ 2024 పరీక్షలు

– జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : నేటి ఆదివారం జరిగిన యూపీఎస్సీ నేషనల్ డిఫెన్స్ అకాడెమీ & నావల్ అకాడెమీ మరియు కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ 2024 పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. ఆదివారము ఉదయం 10 నుండి 12 గంటల వరకు మధ్యాహ్నం 2.00 నుండి 4:30 గంటల వరకు రెండు సెషన్ల లో యూపీఎస్సీ నేషనల్ డిఫెన్స్ అకాడెమీ & నావల్ అకాడెమీ పరీక్ష నిర్వహణ జరిగిందనీ, తిరుపతిలో …

Read More »

సెప్టెంబర్ 2వ తేది (నేడు) జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాలకు సెలవు

-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబర్ 2వ తేది (నేడు) సోమవారం తిరుపతి జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బంగాళా ఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా తిరుపతి జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు, జూనియర్ కళాశాలల …

Read More »

5 కె రెడ్ రన్ మారికాంక్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వైద్యఆరోగ్య శాఖ , జిల్లా ఎయిడ్స్ సంస్థ ఆధ్వర్యంలో ఎయిడ్స్ నియంత్రణలో భాగంగా అవగాహన కల్పిస్తూ 5 కె రెడ్ రన్ మారికాంక్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా లెప్రసీ ఎయిడ్స్ టి. బి తిరుపతి అధికారి డాక్టర్ ఓ. శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఈ 5 కె రెడ్ రన్ మారథాన్ ఉదయం 6 గంటల నుండి భారతీయ విద్యాభవన్ అలిపిరిరోడ్ నుంచి టాటా కాన్సర్ ఆసుపత్రి వరకు మరియు …

Read More »

వర్షాలు తగ్గిన తదుపరి పూర్తి స్దాయిలో ఇసుక సరఫరా

-రాష్ట్ర గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా -రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ఇసుక 15,03,603 మెట్రిక్ టన్నులు -భారీ వర్షాల కారణంగా ఇసుక సరఫరాలో అంతరాయం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదనీటి కారణంగా ఇసుక సరఫరాలో నెలకొన్న అంతరాయాన్ని అతి త్వరలో పునరుద్దరిస్తామని వాణిజ్య పన్నుల శాఖ ఛీప్ కమీషనర్, గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి, ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. వివిధ రీచ్ ల నుండి సరఫరా నిలిచిపోయిందని, …

Read More »

బాదితులకు ప్రభుత్వం అండగా ఉంటుంది…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారీ వర్షాలు వలన గుంటూరు నగరపాలక సంస్థ తూర్పునియోజకవర్గం పరిధిలో ముంపుకు గురైన లోతట్టు ప్రాంతాలను ఆదివారం కేంద్ర గ్రామీణభివృద్ధి , కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ , నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, తూర్పు నియోజకవర్గ శాసన సభ్యులు మహ్మద్ నసీర్ అహ్మద్ తో కలసి పరిశీలించారు. పాతగుంటూరులోని ఎల్బీ నగర్, ప్రగతి నగర్, సుద్దపల్లి డొంక, జూన్ షాహెద్ ప్రాంతాలలో పర్యటించారు. ప్రగతినగర్ , జూన్ షాహెద్ ప్రాంతాల్లో …

Read More »

గుంటూరు నగరంలో లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తొలగించడానికి చర్యలు…

-నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నీరు నిలిచిన లోతట్టు ప్రాంతాల్లో నీటిని తొలగించడానికి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. ఆదివారం బిఆర్ స్టేడియం, శ్రామిక నగర్, ముగ్డుం నగర్, బాలాజీ నగర్ మొండి గేటు తదితర ప్రాంతాల్లో పర్యటించి, ఆయా ప్రాంతాల్లో నిలిచిన వర్షం నీటిని వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ …

Read More »

గుంటూరు నగరంలో మురుగుపారుదలకు అడ్డుగా ఉన్న డ్రైన్ల పై ఆక్రమణల తొలగింపు…

-నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో డ్రైన్ల పై ఆక్రమణలు ఇష్టానుసారం చేస్తున్నారని ఫలితంగా ప్రస్తుత వర్షాలకు డ్రైన్లు బ్లాక్ అయి వర్షం నీరు ఇళ్లల్లోకి, లోతట్టు ప్రాంతాలకు చేరీ స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కల్గిస్తుందని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ తెలిపారు. ఆదివారం జిటి రోడ్, శ్రీనివాసరావు తోట, పాత గుంటూరు, బాలాజీ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి, డ్రైన్ల ఆక్రమణల పై అధికారులపై ఆగ్రహం …

Read More »

లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు..

-రేపు పాఠశాలలు, ఇంటర్మీడియట్ కళాశాలలకు సెలవు -పరిస్థితుల దృష్ట్యా మీకోసం కార్యక్రమం రద్దు మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అధిక వర్షాలు, వరదల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను దగ్గరలోని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నామని, వరద ఉధృతని ఎదుర్కొనేందుకు, ప్రజలను రక్షించేందుకు జిల్లా యంత్రాంగం నిత్యం అప్రమత్తంగా ఉందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ స్పష్టం చేశారు. ఆదివారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ లో మీడియా సమావేశం నిర్వహించి అధిక వర్షాలు, వరదలపై తాజా పరిస్థితులను …

Read More »

జాబ్ మేళా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC), జిల్లా ఉపాధి కల్పన శాఖ మరియు డి ఆర్ డి ఎ – సీడాప్ సంయుక్త అద్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.03.09.2024 మంగళవారం నాడు “అవనిగడ్డ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల” నందు నిర్వహించబోయే “జాబ్ మేళాను”, గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మరియు నెలకొని ఉన్న వరదల కారణంగా అవనిగడ్డ లో నిర్వహించబోయే జాబ్ మేళాను వాయిదా …

Read More »

అధిక వర్షాలు, కృష్ణా నది వరద ఉధృతి పర్యవేక్షించేందుకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

-కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08672-252572 మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లాలో అధిక వర్షాలు, కృష్ణానది వరద ఉధృతి ఎదుర్కోవడానికి జిల్లా కలెక్టర్ కలెక్టరేట్లో 24 గంటలు పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి జిల్లాలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08672-252572. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది కంట్రోల్ రూమ్ లో రెండు, మూడు షిఫ్ట్ లలో 24 గంటలు అందుబాటులో ఉంటూ వారి వారి శాఖల ద్వారా చేపట్టిన …

Read More »