Breaking News

Daily Archives: November 6, 2025

‘ఆప్కో’లోని స్టాక్ తో నూతన డిజైన్లు

* రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత * ఆప్కో గోడౌన్ లో రూ.15 కోట్ల వస్త్రాల స్టాక్ * ఆ స్టాక్ తో చిన్న పిల్లల ఫ్రాగ్ లు, రెడీమేడ్ చీరలు, పంచెలు, క్యారీ బ్యాగ్ ల తయారీ * ఒక వైపు త్వరగా స్టాక్ అమ్మకాలు..మరో వైపు మహిళలకు ఉపాధి కల్పన * ఉనికి కోసం జగన్ డ్రామాలు : మంత్రి సవిత ఫైర్ * మంగళగిరిలోని యర్రబాలెం ఆప్కో గోడౌన్ లో మంత్రి సవిత ఆకస్మిక తనిఖీలు మంగళగిరి/అమరావతి, …

Read More »

భ‌గ‌వాన్ శ్రీ స‌త్య‌సాయి బాబా శ‌తాబ్ది వేడుక‌ల‌కు మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌కు ఆహ్వానం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఈనెల 23న శ్రీ స‌త్య‌సాయి జిల్లా పుట్ట‌ప‌ర్తి ప్ర‌శాంతి నిల‌యంలో నిర్వ‌హించే భ‌గ‌వాన్ శ్రీ స‌త్య‌సాయి బాబా 100వ జ‌యంతి (శ‌తాబ్ది) వేడుక‌ల‌కు నిర్వాహ‌కులు వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌ను ఆహ్వానించారు. స‌త్య సాయి సెంట్ర‌ల్ ట్ర‌స్టు ఏపీ అధ్య‌క్షుడు ఆర్‌. ల‌క్ష్మ‌ణ‌రావు సూచ‌న మేర‌కు ఆహ్వాన ప‌త్రిక‌ను ట్ర‌స్టు ప్ర‌తినిధులు గురువారంనాడు ఏపీ స‌చివాల‌యంలోని కార్యాల‌యంలో మంత్రికి అంద‌జేశారు. రాష్ట్ర కార్య‌క్ర‌మంగా స‌త్య‌సాయిబాబా 100వ జ‌యంతి వేడుక‌లు భ‌గ‌వాన్ శ్రీ స‌త్య‌సాయిబాబా 100వ జ‌యంతి …

Read More »

రాజకీయ రంగులు లేకుండా విద్యార్థులకు యూనిఫార్మ్

-మెరుగైన విద్య వ్యవస్థ స్థాపనకు మంత్రి లోకేశ్ కృషి -మరో 450 మంది విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందజేత -రూ. 4.75 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు శంకుస్థాపన -90 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ -ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అద్దంకి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర చరిత్రలో రాజకీయ రంగులతో సంబంధం లేకుండా పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫార్మ్, బెల్ట్, బ్యాగ్ అందించామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో మెరుగైన విద్య …

Read More »

అన్నదానం అనేది అన్ని దానాల్లో కల్లా శ్రేష్టం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అన్నదానం అనేది అన్ని దానాల్లో కల్లా శ్రేష్ఠమని ప్రముఖ విద్యావేత్త, గుంటూరు వాస్తవ్యులు ప్రస్తుత అమెరికన్ పౌరసత్వం కలిగిన వెంకట్ ఇక్కుర్తి ఐ.వి.యల్.యన్ శర్మ తెలిపారు. గురువారం మధ్యాన్నం ఆయన నగరంలోని అమరావతి రోడ్డులోని ఐ.డి హాస్పిటల్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ని సందర్శించి భోజనం చేసారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని పేద ప్రజలను ద్రుష్టిలొ ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్ లను ఏర్పాటు చేయడం పేద …

Read More »

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ స్టడీ టూర్…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ఘన వ్యర్ధాలను పర్యావరణహితంగా నిర్వహించడానికి, నగరాల్లో డంపింగ్ యార్డ్ లు లేకుండా చేయడానికి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ లు దోహదపడతాయని తమిళనాడు మునిసిపల్ శాఖ డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్(డిఎంఏ) పి.మధుసూదన్ రెడ్డి అన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ స్టడీ టూర్ లో భాగంగా గురువారం తమిళనాడు మున్సిపల్ విభాగం నుండి గుంటూరు వచ్చిన డిఎంఏ, మదురై కార్పోరేషన్ కమిషనర్ చిత్ర విజయన్, హోసూర్ కార్పోరేషన్ ఈఈ విక్టర్ జ్ఞానరాజ్, ఏఈ (డిఎంఏ) రవి చంద్రన్ …

Read More »

ఏపీ సెక్రటేరియట్(HOD, GAD) ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులను పరిశీలించిన అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవతేజ 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజారాజధాని అమరావతిలోని కీలక భవన సముదాయాల నిర్మాణ పనులు జరుగుతున్న అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(ఏజిసి)లోని ఏపీ సెక్రటేరియట్(HOD, GAD) ఐకానిక్ టవర్లను సిఆర్డిఏ అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవతేజ ఐఏఎస్ పరిశీలించారు. టవర్లు నిర్మిస్తున్న ప్రాంతంలో పనుల పురోగతిని చీఫ్ ఇంజినీర్ ఎం.వీ.రావు(HOD, GAD టవర్లు), ఇంజినీరింగ్ విభాగంలోని ముఖ్య అధికారులు..అడిషనల్ కమిషనర్ కి వివరించారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు ఇంటిగ్రేటెడ్ ఏపీ సెక్రటేరియట్(HOD, GAD) ఐకానిక్ టవర్ల వద్ద పనులు పూర్తవ్వాలని అడిషనల్ కమిషనర్ గుత్తేదారులను, సంబంధిత …

Read More »

రేషన్ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ గురువారం విజయవాడ, రామవరప్పాడులో రేషన్ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ దుకాణం ద్వారా కార్డుదారులకు అందుతున్న సేవలు, సరుకులకు సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం రామవరప్పాడులో అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ కేంద్రం ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందుతున్న పౌష్టిక ఆహారం వివరాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్న తీరును పరిశీలించారు. చిన్నారుల మేధో వికాసానికి నిర్దేశించిన పాఠ్య ప్రణాళికను కచ్చితంగా అమలు …

Read More »

లోఓల్టేజ్ సమస్య ఎక్కడైనా ఉంటే తక్షణమే పరిష్కరించాలి

-ఏపీసీపీడీసిఎల్ సర్కిల్ ఆఫీస్ సీఎండీ పి. పుల్లా రెడ్డి విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : స్ధానిక పీడబ్ల్యూడి గ్రౌండ్స్ వద్ద గల ఏపీసీపీడీసిఎల్ సర్కిల్ ఆఫీస్ సీఎండీ పి. పుల్లా రెడ్డి గురువారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్ఈ లు, ఈఈ లతో పీఎం సూర్య ఘర్, రెవెన్యూ కలెక్షన్స్, సైక్లోన్ డ్యామేజెస్, ఆర్డీఎస్ఎస్ (Revamped Distribution sector Scheme)పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ పి. పుల్లా రెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ వసూళ్లను నూరు శాతం సాధించాలని ఆదేశించారు. …

Read More »

కిడ్నీ బాధితుల ఆరోగ్యానికి పూర్తి భ‌రోసా క‌ల్పిస్తున్నాం

– నెఫ్రాల‌జిస్టు వైద్య సేవ‌ల‌ను విస్తృతం చేస్తాం – రోగుల‌కు మందులు, పౌష్టికాహారంపై ప్ర‌త్యేక దృష్టిపెడుతున్నాం – రోగులు వైద్యుల సూచ‌న‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా పాటించాలి – వ‌చ్చే జ‌న‌వ‌రి నుంచి ఎ.కొండూరుకు కృష్ణా జ‌లాలు పంపిణీ చేస్తాం – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ ఎ.కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని ఎ.కొండూరు, ప‌రిస‌ర ప్రాంతాల్లోని కిడ్నీ వ్యాధిగ్ర‌స్తుల ఆరోగ్య ప‌రిర‌క్ష‌ణ‌పై రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక శ‌ద్ధ పెడుతోంద‌ని, నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌తో వైద్య సేవ‌లు అందిస్తున్నామ‌ని, రానున్న జ‌న‌వ‌రి నుంచి కృష్ణా జ‌లాల‌ను …

Read More »

ప్ర‌త్యేక స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ‌కు సిద్ధంకండి

– ఓట‌ర్ల జాబితా ఎస్ఐఆర్‌పై పూర్తిస్థాయి అవ‌గాహ‌న ముఖ్యం – జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఓట‌ర్ల జాబితా ప్ర‌త్యేక స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ (స్పెష‌ల్ సమ్మ‌రీ రివిజ‌న్‌-ఎస్ఐఆర్‌) ప్ర‌క్రియ‌పై పూర్తిస్థాయి అవ‌గాహ‌న పెంపొందించుకొని సిద్ధంగా ఉండాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అధికారుల‌కు సూచించారు. గురువారం రాష్ట్ర చీఫ్ ఎల‌క్టోర‌ల్ ఆఫీస‌ర్ (సీఈవో) వివేక్ యాద‌వ్‌.. వెల‌గ‌పూడి స‌చివాల‌యం నుంచి అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లతో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ప్ర‌జా ప్రాతినిధ్య చ‌ట్టం, 1950లోని కీల‌క సెక్ష‌న్లు, …

Read More »