Breaking News

Daily Archives: January 10, 2026

సీనియర్ జర్నలిస్ట్ లకు పెన్షన్ మంజూరు కు కృషి చేస్తా.!!

-వెటరన్ జర్నలిస్ట్ అసోసియేషన్ కు తిరుపతి ఎంపీ భరోసా ! తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశవ్యాప్తంగా వెటరన్ జర్నలిస్ట్ లకు జాతీయ పెన్షన్ సాధన కోసం తన వంతు కృషి చేస్తా నని తిరుపతి యంపి డా.మద్దెలగురుమూర్తి పేర్కొన్నారు. శనివారం తిరుపతి లో ఆయన కార్యాలయంలో సీనియర్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు డా. టి.జనార్దన్, ఎపి వెటరన్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యం.నరేంద్ర రెడ్డి, ఆర్.చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు పి. వి. రవికుమార్ …

Read More »

నగరంలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ధర్నా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాల విద్యలో మాతృభాషా మాధ్యమం అమలు చేయాలని ఉమ్మడి సర్వీసు రూల్స్ కు ప్రత్యామ్నాయం అమలు చేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు కే నరహరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆంధ్రప్రదేశ్ డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలోధర్నా చౌక్ లో ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ అధ్యక్షులు కే. నరహరి, ప్రధాన కార్యదర్శి ఎన్వి. రమణయ్య, వర్కింగ్ జనరల్ సెక్రటరీ ఎన్. శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కారే. కృష్ణ  తదితరులు పాల్గొని మాట్లాడుతూ ఉపాధ్యాయ …

Read More »

ది యంగ్మెన్స్ ముస్లిమ్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ది యంగ్మెన్స్ ముస్లిమ్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ శనివారం విజయవాడ ఏలూరు రోడ్డు అరండల్ పేట లోని షాదీ ఖానా లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపులో యునాని హాస్పిటల్స్ సీనియర్ కార్డియాలజిస్ట్ 30 సంవత్సరాల అనుభవం కలిగిన హకీమ్ డా. ఎం. ఖలీలుల్లా పేషెంట్లకు వైద్యం చేశారు. అనంతరం ఖలీలుల్లా మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజల కోసం అందరికీ అందుబాటులో ఉండే విధంగా పూర్తిగా ఉచిత కన్సల్టేషన్ కల్పిస్తున్నట్లు …

Read More »

రైతులు సాగుచేసిన ఎర్ర చందనం శ్రీ గంధం చెట్ల మీద అటవీ శాఖ నిబంధనలు వర్తింప చేయకూడదు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎర్రచందనం, శ్రీగంధం చోరీ కేసులను రాష్ట్రాల పరిధి నుంచి తీసి సి బి ఐ పరిధిలోకి తీసుకువెళ్లాలని శ్రీగంధం ఎర్రచందనం పెంపకం దారుల సమాఖ్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసింది. రైతులు సాగుచేసిన ఎర్ర చందనం శ్రీ గంధం చెట్ల మీద అటవీ శాఖ నిబంధనలు వర్తింప చేయకూడదని విజ్ఞప్తి చేసింది. గుణదలలోని పార్క్ హయత్ హోటల్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎర్రచందనం శ్రీగంధం చెట్ల పెంపకం దారుల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి తుమ్మల మురళీకృష్ణ …

Read More »

రైతులంతా సంఘటితంగా ఉండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థించాలి… : రతన్ ప్రకాష్ వటల్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీగంధం సాగు చేసే రైతుల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారాలను నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగిందని సెంట్రల్ శాండల్ వుడ్ కమిటీ చైర్మన్ రతన్ ప్రకాష్ వటల్ తెలిపారు. నివేదిక అమలకు రైతులంతా సంఘటితంగా ఉండి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థించాలని సూచించారు. నివేదిక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలుపరిచేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. గుణదలలోని పార్క్ హయత్ హోటల్లో ఎర్రచందనం శ్రీగంధం చెట్ల పెంపకం దారుల సమాఖ్య …

Read More »

కె ఎల్ యూనివర్సిటీ మొదటి విడత ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల…

-ఆడపిల్లకు చదువే అసలైన ఆస్థి… -రాష్ట్ర హోం మంత్రి వంగల పూడి అనిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆడపిల్లకు చదువే అసలైన ఆస్థి అని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. శనివారం నాడు వడ్డేశ్వరంలోని కెఎల్ డీమ్డ్ యూనివర్శిటీలో కె ఎల్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్ లలో ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశానికై జాతీయ స్థాయిలో నిర్వహించిన మొదటి విడత ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ఫలితాలను ఆమె విడుదల చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయిన ఆమె మాట్లాడుతూ …

Read More »

సినిమా, సంస్కృతి, సాహిత్యాల సమ్మేళనం ఆవ‌కాయ్‌..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతోత్సవాల్లో భాగంగా చివ‌రిరోజు కృష్ణాతీరంలో ముగింపు కార్య‌క్ర‌మాలు క‌నువిందు చేశాయి. చౌరాస్తా వారిచే సంగీత ప్ర‌ద‌ర్శ‌న‌, న‌ట‌సార్వ‌భౌమ ఎన్‌టీఆర్‌: న‌ట‌నా విశ్వ‌రూపానికి నివాళి పేరుతో నిర్వ‌హించిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం అల‌రించింది. మహానటుడు నందమూరి తారక రామారావు జీవితాన్ని, ఆయన నటనలో ప్రదర్శించిన విశ్వవ్యాప్త శైలిని స్మరించుకుంటూ నిర్వ‌హించిన ఈ కార్య‌క్ర‌మం ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది. ఎన్‌టీఆర్ గారి సినీ జీవితం, నటనలో ఆయన విశిష్ట‌త‌, ప్రత్యేక పాత్రలు, ఆయనతో సంబంధం ఉన్న సినీ ప్ర‌ముఖులు అనుభవాలు వివరించబ‌డ్డాయి. సినీ …

Read More »

అట్టహాసంగా ముగిసిన ‘అమరావతి ఆవకాయ్’ వేడుకలు

-ముగింపు వేడుకల్లో పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్, పలువురు శాసనసభ్యులు -2026 డిసెంబర్ 17,18,19 తేదీల్లో అమరావతి ఆవకాయ్ ఫెస్టివల్ నిర్వహిస్తామని మంత్రి దుర్గేష్ అధికారిక ప్రకటన -త్వరలోనే నంది నాటకోత్సవాలు, నంది అవార్డుల ప్రదానం -3 రోజుల వేడుకల్లో భాగంగా 45 వేల మందికి పైగా సందర్శన విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు వారి సంస్కృతికి, రుచులకు మరియు కళలకు ప్రతిబింబంగా నిలిచిన ‘అమరావతి ఆవకాయ్’ ఉత్సవాలు ఆదివారం సాయంత్రం అత్యంత వైభవంగా ముగిశాయి. విజయవాడలోని పున్నమి ఘాట్, భవానీ …

Read More »

నగరంలో ఘనంగా ఖాదీ మహోత్సవం

-రూ. 1.50 కోట్ల మైలురాయిని దాటిన విక్రయాలు -ఇప్పటికే 7 రోజులపాటు విజయవంతంగా నిర్వహణ ముగింపు దశకు చేరుకున్న ప్రదర్శన – చివరి 3 రోజులే -ఖాదీని ఆదరిద్దాం – వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాలకు చేయూత నిద్దాం -ఖాదీ మహోత్సవ ఎగ్జిబిషన్‌లో ర్యాంప్ వాక్‌కు ఘన స్వాగతం -ఆకట్టుకున్న మహిళల ఖాదీ ర్యాంప్ వాక్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలోని మేరిస్ స్టెల్లా కళాశాల ఇండోర్ స్టేడియంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న ‘ఖాదీ మహోత్సవం’ ప్రదర్శన నగర ప్రజలను విశేషంగా …

Read More »

చూడ‌ముచ్చ‌ట‌గా మూడో రోజు ఆవ‌కాయ్..

– సంప్ర‌దాయ క‌ళల సోయగంతో అల‌రిస్తున్న ఉత్స‌వాలు – వినోదంలో విజ్ఞానాన్ని రంగ‌రించి అందించిన కార్య‌క్ర‌మాలు – క‌ళాకారుల‌కు జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ అభినంద‌న‌లు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సినిమా, సంస్కృతి, సాహిత్యాల సమ్మేళనంగా కొనసాగుతున్న ఆవ‌కాయ్‌.. అమరావతోత్సవాల్లో భాగంగా మూడో రోజు శ‌నివారం ఉద‌యం నుంచి భవానీ ద్వీపంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంప్రదాయ కళలకు వేదికగా నిలిచిన ఈ వేడుకలు సందర్శకులకు కళా రుచితో పాటు జ్ఞానాన్నీ పంచాయి. కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ డా. …

Read More »