Breaking News

ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్య సేవలు మరింతగా అందుబాటులోకి రావాలి.

-ప్రాధమికవిద్యలో బడి మానేసిన పిల్లలు వుండరాదు. జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పై, ప్రభుత్వ వైద్యశాలల్లో ఆరోగ్యశ్రీ సేవల పై అవగాహన కల్పించి వైద్య సేవలు మరింత పెంచాలని, ప్రాధమిక విద్య లో బడిమానేసిన పిల్లలు ఉండరాదని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి ఆదేశించారు.గురువారం సాయంత్రం అమరావతి నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె .ఎస్. జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు తో వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించగా జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. వైద్య శాఖ జగనన్న ఆరోగ్య సురక్ష, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ సేవలు , ప్రభుత్వ వైద్య శాలల్లో ఆరోగ్యశ్రీ సేవలు మరింతగా పెరగాలని అన్నారు. ప్రత్యేకంగా యుక్తవయసు ఆడ పిల్లల్లో , గర్భిణీ స్త్రీల విషయంలో రక్త హీనతకు ఆస్కారం లేకుండా సరైన సమయానికి వైద్యసేవలు, పౌష్టి కాహరం, ఐ ఎఫ్ ఏ టాబ్లెట్స్ పంపిణీ చేస్తూ తరచూ మానిటర్ చేయాలని అన్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం పై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని సూచించారు. జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే , హెల్త్ క్యాంపు లు పక్కగా నిర్వహించాలని అన్నారు. నాడు – నేడు పనులు త్వరగా పూర్తికా కావాలని , ప్రాధమిక విద్యలో బడి మానేసిన పిల్లలు వుండరాదని ఇంటర్ విద్యార్థుల సప్లి తప్పక వ్రాసే విథంగా ఆర్ ఐ ఒ చర్యలు తీసుకోవాలని, మంచి ఫలితాలు సాధించాలని అన్నారు.ఈ సమీక్షలో సిపిఓ ప్రేమచంద్రా రెడ్డి, డి ఎల్ డి ఓ సుసీలా దేవి, పిడి లు ఐసి డి ఎస్ జయలక్ష్మి , హౌసింగ్ వెంకటేశ్వర్లు, ఎస్ సి వెల్ఫేర్ ఆఫీసర్ చెన్నయ్య, డి ఎం హెచ్ ఓ హరి, ఆరోగ్య శ్రీ జిల్లా మేనేజర్ శివ కుమార్,. డా శ్రీనివాస రావు, ఫ్యామిలీ డాక్టర్ కోఆర్డనేటర్ డా.హనుమంతరావు, ఆర్ ఐ ఓ , జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *