-జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో
– కె. హరిచంద్ర ప్రసాద్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 10-10-2023 వ తేదీ మంగళవారం రోజున జిల్లా ఉపాధి కార్యాలయం, SBI బ్యాంకు సమీపంలో, తాడితోట, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా – 533101 నందు మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె హరిచంద్ర ప్రసాద్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళా కు ప్రముఖ కంపెనీలైన సుస్వదీప్ ఆగ్రో సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, క్యూస్ ఖోర్ప్ వతదితర కంపెనీలు హాజర వుతున్నాయని తెలియ జేసారు. ఎంపికైన అభ్యర్థులకు జీతం వారి విద్యార్హతను బట్టి సుమారు రూ .12 వేల నుంచి రూ. 35 వేల వరకు ఉంటుందని తెలిపారు. మరింత సమాచారం కోసం తగిన సహాయం కొరకు 8247437773, 8328486787 సెల్ నెంబర్ల ని సంప్రదించ గలరని తెలియ చేశారు. ఈ జాబ్ మేళా కు 10వ తరగతి , ఇంటర్, డిగ్రీ, బి టెక్ విభాగముల వరకు చదువుకున్న, 18-35 సం.ల వయసు గల నిరుద్యోగ యువతి, యువకులు వారి యొక్క బయోడేటా లేదా రెస్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ జిరాక్స్, ఆధార్ నకలు మరియు పాస్ పోర్ట్ ఫోటో లతో నేరుగా ఇంటర్వ్యూ కు అక్టోబర్ 10 వ తేదీ ఉదయం 9.30 గంటలకు జిల్లా ఉపాధి కార్యాలయం, SBI బ్యాంకు సమీపంలో, తాడితోట, రాజమహేంద్రవరం, హాజరు కాగలరని కోరుతున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ముందస్తుగా వారి వివరాలను www.ncs.gov.in, www.apssdc.in వెబ్ పోర్టల్ నందు నమోదు చేసుకోవాలని తెలియ చేశారు.