Breaking News

మినీ జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో అక్టోబర్ 21 వ తేదీ శనివారం జిల్లా ఉపాధి కార్యాలయం, షెల్టన్ హోటల్ సమీపంలో, HP పెట్రోల్ పంప్ వెనుక, తాడితోట, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా – 533101 నందు మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె . హరిచంద్ర ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళా కు ప్రముఖ కంపెనీలైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC), మెడ్ ప్లస్ ఫార్మసీ వంటి కంపెనీలు హాజరవుతున్నాయని తెలియజేసారు. ఇంటర్వూలకు హాజరయ్యే అభ్యర్థులకు వారి విద్యార్హతను బట్టి సుమారు వారి జీతం రూ.9,500/- నుంచి రూ.25,000/- వరకు ఉంటుందని తెలిపారు. ఇతర వివరాలు కొరకు 8247437773, 8328486787 నెంబర్ సంప్రదించగలరు. ఈ జాబ్ మేళా కు 10 వ తరగతి , ఇంటర్, డిగ్రీ, బి డిఎం ఫార్మసీ పిసిఐ కలిగిన ధ్రువపత్రాల విభాగముల వరకు చదువుకున్న, 18-35 సం.ల మధ్య వయసు గల నిరుద్యోగ యువతి, యువకులు వారి యొక్క బయోడేటా లేదా రెస్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ జిరాక్స్, ఆధార్ నకలు , పాస్ పోర్ట్ ఫోటో తో నేరుగా ఇంటర్వ్యూ కు హాజరు కాగలరని తెలియచేశారు. జాబ్ మేళా జరుగు వివరాలు: తేదీ . :- 21-10-2023 సమయం :- ఉదయం 09:30 నుండి జరుగును. స్థలం :- జిల్లా ఉపాధి కార్యాలయం, షెల్టన్ హోటల్ సమీపంలో, HP పెట్రోల్ పంప్ వెనుక, తాడితోట, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా – 533101 అభ్యర్థులు www.ncs.gov.in వెబ్ పోర్టల్ నందు నిరుద్యోగ యువత వారి వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *