-ఎంజీ రోడ్డు లో సందడే సందడి
-సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడంలో ఎల్లవేళలా ముందుండే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీ) సంక్రాంతి పర్వదినాన విజయవాడ ఎంజీ రోడ్డు లోని పైలెట్ సర్వీస్ స్టేషన్ పెట్రోల్ బంక్ లో సోమవారం నిర్వహించిన క్యాలెండర్ పండుగకు విశేష స్పందన లభించింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరిగిన ఈ పండుగలో దాదాపు 800 మంది వినియోగదారులు తమ తమ కుటుంబ సభ్యులతో తరలివచ్చి నిర్వాహకులు ఏర్పాటుచేసిన హరిదాసులు, గంగిరెద్దులతో ఎంతో హుషారుగా ఫోటోలు దిగి ఆపై తమ తమ ఫోటోలతో కూడిన 2024 సంవత్సరం కలర్ క్యాలెండర్ లను ఉచితంగా తమ వెంట తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సంస్థ అధిపతి ఎం వి వి సత్యనారాయణ మాట్లాడుతూ గడిచిన తొమ్మిదేళ్లుగా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నామని అలాగే ఏడాది మొత్తం ఇలా ఏదో ఒక శుభ సందర్భంలో అనేక అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు టెలికం సలహా కమిటీ ఉమ్మడి గుంటూరు జిల్లా సభ్యులు నిమ్మరాజు చలపతిరావు, ఎన్టీఆర్ జిల్లా సేల్స్ ఆఫీసర్ కే వరప్రసాద్, సంస్థ మేనేజర్ కే వెంకటప్పయ్య, ఐ ఓ సీ చీఫ్ డివిజనల్ రిటైల్ హెడ్ అనిల్ కుమార్, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.