రాజమండ్రి , నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా ఇన్చార్జి మంత్రి , రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఉదయం గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా.. రూరల్ నియోజక వర్గం లో విస్తృత పర్యటన నగర పాలక సంస్థ 18 వార్డులోని కొండా వారి వీధి, పాలిక వారి వీధి, గుత్తులవారి వీధి, కేతావారి వీధి, ఉరం వారి వీధి, కట్టుమూరు వారి వీధి, గోడేవారి వీధి, చెల్లె వారి వీధి పర్యటన ప్రజలతో మమేకమైన మంత్రి వేణు ఇంటింటికి వెళ్లి మహిళలు, వృద్ధులు, పాఠశాల విద్యార్థులను కలుసుకొని వారి సమస్యలను తెలుసుకొన్న మంత్రి వాటి పరిష్కరించే దిశగా అధికారులకు అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేసారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులు మంత్రి వేణు పనిచేయాలన్నారు.