Breaking News

అన్ని విభాగముల అధికారులతో సమీక్షా సమావేశం…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆలయ కార్యనిర్వాహనాధికారి కె ఎస్ రామరావు మహామండపం 4 వ అంతస్తు లోని కార్యనిర్వాహనాధికారి వారి కార్యాలయం నందు అన్ని విభాగముల అధికారులతో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించి, పలు అంశాలపై చర్చించారు. ఇందులో భాగముగా మాస్టర్ ప్లాన్ లో భాగముగా అన్ని విభాగముల వారు తీసుకొనవలసిన చర్యలు, భక్తులకు త్వరగా దర్శనం కల్పించుటకు చర్యలు, ఆధ్యాత్మికను మరియు ఇంద్రకీలాద్రిని సౌందర్యవంతముగా మరింత పెంచు విధముగా చర్యలు, పెరుగుచున్న రద్దీ దృష్ట్యా తక్షణం పార్కింగ్ సౌకర్యాలు పెంచుటకు గల అవకాశాలు పరిశీలించుట తదితర అంశములపై సుధీర్ఘముగా చర్చించి, అందరూ తమ వంతు పాత్ర పోషిస్తూ ఆలయ అభివృద్ధికి మరింత కృషి చేసి, భక్తులకు మెరుగైన వసతులు కల్పించి, మరింత చేరువ కావాలని ఆలయ అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక ఇంజినీర్ లింగం రమాదేవి గారు, ఇంజినీరింగ్ సిబ్బంది, ఆలయ సహాయ కార్యనిర్వాహణాధికారులు, పర్యవేక్షకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తాను : దేవినేని అవినాష్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *