విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్.టి.ఆర్.జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ది.13.05.2024వ తేదిన జరిగిన సార్వత్రిక ఎన్నికల ఈ.వి.ఎం.బాక్స్ లను భద్రపరుచుటకు ఇబ్రహింపట్నం పోలీస్ స్టేషన్ పరిది, జూపూడి గ్రామంలోని నిమ్రా మరియు నోవా కళాశాలల నందు స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సదరు ఏరియా నుండి రెండు కిలోమీటర్ల మేర రెడ్ జోన్ (నో ఫ్లయింగ్ జోన్) గా ప్రకటించడం జరిగింది. కావున సదరు ప్రాంతంలో డ్రోన్స్ గాని, బెలూన్స్ గాని ఎగరవేయుట నిషేధించడమైనది. దీనిని అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ పి.హెచ్.డి.రామకృష్ణ ఐ.పి.ఎస్. తెలియజేశారు.
Tags vijayawada
Check Also
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తాను : దేవినేని అవినాష్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో …