Breaking News

రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కోలుసు పార్థసారథి కి అభినందనలు తెలిపిన ఏపిఏంపిఏ నాయకులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ మరియు సమాచార, పౌర సంబధాల శాఖ మంత్రిగా బాధ్యత స్వీకరించిన కొలుసు పార్థసారధిని ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోషియేషన్ సభ్యులు దుశ్శాలువాతో, పూలబోకెలతో అభినందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఏ.పి.ఏం.పి. ఏ. రాష్ట్ర అధ్యక్షులు వీర్ల శ్రీరాం యాదవ్, ప్రధాన కార్యాదర్శి శాఖమూరి మల్లికార్జునరావు, ఉపాధ్యక్షులు సోమేశ్వరరావు, కోశాధికారి మత్తి శ్రీకాంత్, రాష్ట్ర సెక్రెటరీ యేమినేని వెంకటరమణ, నగర నాయకులు కోట రాజ, మానేపల్లి మల్లి, కోటేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సారథి మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి నూతన ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని అన్నారు.

Check Also

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తాను : దేవినేని అవినాష్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *