మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, పోర్టు కనెక్టివిటీ రైలు రోడ్డు మార్గాల ఏర్పాటుకు భూసేకరణ సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ పోర్టు, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించి మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులు, పోర్టు కనెక్టివిటీ రోడ్డు రైలు మార్గాల ఏర్పాటుకు భూ సేకరణ సమస్యలపై సమీక్షించారు. ఈ సమావేశంలో కలెక్టర్ బందరు పోర్టు నిర్మాణ పనుల పురోగతిపై ఆరా తీశారు. పనులు వేగవంతం గావించాలన్నారు. ముఖ్యంగా బందరు పోర్టు కనెక్టివిటీ రైలు రోడ్డు మార్గాల నిర్మాణానికి అవసరమైన భూసేకరణలో సమస్యలు పరిష్కరించేందుకు తీసుకోవలసిన చర్యలపై సమావేశంలో సమగ్రంగా చర్చించారు. తదుపరి ఎలాంటి లీగల్ సమస్యలు రాకుండా ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయాలని రెవిన్యూ అధికారులకు కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, బందరు ఆర్డిఓ ఎం వాణి, మ్యారీ టైం బోర్డు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకట్రావు, మెరైన్ డివిజన్ డిఈఈ ఎం. శివయ్య, ఏఈ రామకృష్ణ, తాసిల్దార్ వెంకటేశ్వరరావు, కలెక్టరేట్ ల్యాండ్ సెక్షన్ సూపర్నెంట్ తేజేశ్వరరావు, మేఘా ప్రతినిధులు రాఘవేంద్ర, తులసీదాస్ తదితరులు పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …