Breaking News

డయేరియా నివారణ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టేందుకు కార్పొరేషన్ లో సమీక్ష సమావేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జి కమీషనర్ అడిషనల్ కమిషనర్ జనరల్ డాక్టర్ ఏ మహేష్ మరియు అడిషనల్ కమీషనర్ ప్రాజెక్ట్స్ కె వి సత్యవతి సీజనల్ వ్యాధులైన డయేరియా, మలేరియా, డెంగ్యూ బారిన పడకుండా ఉండేందుకు జరుగుతున్న పనుల పై అధికారులతో ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో శనివారం సాయంత్రం సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వాతావరణం మార్పుల వల్ల కలిగే డయేరియా, మలేరియా, డెంగ్యూ సమస్యల నుండి నివారణ కొరకు తీసుకుంటున్న చర్యలు అధికారులతో చర్చించారు. ముఖ్యంగా ప్రజలు డయేరియా, వర్షపు నీటి నిలువలు వల్ల కలిగే సమస్యల సంబంధిత ఫిర్యాదులను తెలిపేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్ ను ప్రతిరోజు 24 గంటలు, అందుబాటులో ఉంచుతూ, అందుకు అనుగుణంగా సిబ్బందిని మూడు షిఫ్ట్ లలో అందుబాటులో ఉండటమే కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఫిర్యాదు అందిన వెంటనే, సత్వరముగా పరిష్కారం అందించేటట్టు చర్యలు తీసుకోవాలని అన్నారు.

ప్రతి సర్కిల్లో
త్రాగునీరు ఎక్కడ కలుషితం కాకుండా ఎప్పటికప్పుడు పటిష్టమైన చర్యలు తీసుకుంటూ నీటి నమూనాలు సేకరిస్తూ నిరంతరం పరీక్షలు నిర్వహిస్తూ కేవలం స్వచ్ఛమైన నీరుని ప్రజలకు అందేటట్టు చర్యలు తీసుకోవాలని, సైడ్ డ్రైన్ లలో ఎప్పటికప్పుడు పూడికలను శుభ్రపరుస్తూ త్రాగునీటి పైపులు ఎట్టి పరిస్థితుల్లో కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని, అధికారులకు ఆదేశించారు

ముఖ్యంగా ప్రజలకు డోర్ టు డోర్ క్యాంపెయిన్ ద్వారా కాచిన త్రాగు నీటిని తాగాలని, ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఓవర్ హెడ్ ట్యాంకులను వారానికి ఒకసారి బ్లీచింగ్ లతో పరిశుభ్రపరచాలని, కేవలం వేడిగా ఉన్న ఆహారాన్నే తీసుకోవాలని, తినే పదార్థాలను పరిశుభ్రమైన చేతులతో పట్టుకోవాలని, మరుగుదొడ్లు వినియోగించుకున్న తర్వాత చేతులను పరిశుభ్రంగా కడుక్కోవాలన్న విషయాలపై హెల్త్ సెక్రటరీస్ తో డోర్ టు డోర్ క్యాంపెయిన్ పక్కాగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

డయేరియా సంబంధిత ఫిర్యాదులను నగర ప్రజలు 8181960909 నెంబర్కు వాట్సాప్ ద్వారా తెలియపరచవచ్చని,
08662422515; 08662427485;
08662424172; 08662422400; నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఇంచార్జి కమిషనర్ గారు తెలిపారు.

15వ ఆర్థిక సంఘం పనులపై సమీక్ష
తదుపరి 15వ ఆర్థిక సంఘం నిధులపై చేసిన పనులను జరుగుతున్న పనులను అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎప్పటికప్పుడు పనులను సత్వరమే పూర్తి చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్స్ కే సత్యవతి అధికారులతో అన్నారు.

ఈ సమావేశంలో ఇంచార్జి కమిషనర్ డాక్టర్ ఏ మహేష్, అడిషనల్ కమిషనర్ కేవీ సత్యవతి తో పాటు చీఫ్ ఇంజనీర్ ఏం ప్రభాకర్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పి రత్నవళి, జోనల్ కమిషనర్లు రమ్య కీర్తన, ప్రభుదాస్, శివరామకృష్ణ, ఎస్సీ ప్రాజెక్ట్ రామ్మోహన్రావు, జీ సామ్రాజ్యం, శ్రీనివాసరావు, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్లు డాక్టర్ సురేష్ బాబు, డాక్టర్ రామకోటేశ్వరరావు, డాక్టర్ బాబు శ్రీనివాస్, ఏ ఈ లు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *