విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని తొలి ఏకాదశి పండుగ సందర్భంగా శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై జగన్మాత దుర్గమ్మకు విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) సతీమణి కేశినేని జానకి లక్ష్మీ బుధవారం సంప్రదాయ పద్ధతిలో సారెను సమర్పించారు. స్పృహప్తి చారిటబుల్ ట్రస్ట్ మహిళల బృందంతో కలిసి పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, పట్టు వస్త్రాలు, మిఠాయిలు, చలిమిడి తీసుకువచ్చారు. వీరికి ఆలయ మర్యాదలతో ఈవో కె.ఎస్.రామారవు, ఎ.ఈ.వో సుధారాణి స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. కేశినేని జానకి లక్ష్మీ అమ్మవారికి పూలజడ సమర్పించటంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేశినేని జానకి లక్ష్మీ ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు అందుకున్నారు.
ఆ తర్వాత ఆరోవ అంతస్తులోని మల్లికార్జున మహా మండపంలో సారెను మూల విరాట్కు చూపించి, అర్చకులకు అందజేశారు. పూజానంతరం తనతో వచ్చిన మహిళా భక్తులకి కేశినేని జానకి లక్ష్మీ చలిమిడి ప్రసాదంగా అందజేశారు.అమ్మవారికి తెచ్చిన చీరను కేశినేని జానకి లక్ష్మీ చీరల కౌంటరులో ఇవ్వగా..ఎ.ఈ.వో సుధారాణి క్యూఆర్ కోడ్ రసీదును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు, కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, ఎమ్.వి.సుధాకర్, స్పృహప్తి చారిటబుల్ ట్రస్ట్ మహిళా సభ్యులు లక్ష్మి ప్రసన్న, భారతి, కె.పద్మ, ఆర్.రాధ, ఎ.అశ్విని, ఆర్.వాణి, యు.శ్రీకీర్తి పాల్గొన్నారు.