మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ధరల స్థిరీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సూపర్ మార్కెట్లలో కూడా నాణ్యమైన కంది పప్పు, బియ్యం విక్రయాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు మచిలీపట్నం తహశీల్దార్ కె విజయ్ కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. దేశవాలి కంది పప్పు కేజీ రూ.160/-లకు, సోనా మసూరి బియ్యం కేజీ రూ.48/-, సోనా మసూరి స్ట్రీమ్డ్ బియ్యం కేజి రూ.49/-లకు విక్రయిస్తున్నట్టు తెలిపారు. డీమార్ట్, విశాల్ మార్ట్, రిలయన్స్ మార్ట్, వాణిశ్రీ జనరల్ స్టోర్స్, NR జనరల్ స్టోర్ లో ఈ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇప్పటికే రైతుబజార్ లో ప్రత్యేక కౌంటర్ ద్వారా విక్రయాలు ప్రారంభించామన్నారు. ఇప్పటి వరకు 5.3 టన్నుల బియ్యం, 2.3 టన్నుల కంది పప్పు విక్రయాలు జరిగాయన్నారు.
Tags machilipatnam
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …