మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మచిలీపట్నం రహదారులు భవనాల అతిధి గృహానికి సోమవారం చేరుకోగా వారిని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా పోలీస్ అధికారి గంగాధర్ రావు జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు ఆర్డిఓ ఎం వాణి హౌసింగ్ పీడీ సూర్యనారాయణ, సమాచార పౌర సంబంధాల అధికారి ఎం వెంకటేశ్వర ప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి ఏం పద్మావతి పార్వతి డిఎస్ఓ పార్వతి తదితర జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలు, పుష్ప గుచ్చాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో చేపట్టిన, అమలవుతున్న వివిధ అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు, శాంతిభద్రతలు తదితర అంశాలపై వారిని మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Tags machilipatnam
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …