Breaking News

ముందస్తు భద్రత చర్యల్లో భాగంగా లంక గ్రామాల ప్రజల తరలింపు

-నగరంలో ఏర్పాటు చేసిన రెండు పునరావాస కేంద్రాలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గోదావరీ ప్రాంతంలోని మూడు లంక గ్రామాల్లో ఉన్న కుటుంబాలను ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రానికి తరలించడం జరిగిందని రెవిన్యూ డివిజనల్ అధికారి ఏ.. చైత్ర వర్షిణి తెలిపారు.

సోమవారం ఉదయం నుంచి మత్స్య, అగ్నిమాపక, రెవిన్యూ, మునిసిపల్ యంత్రాంగం ఆధ్వర్యంలో ఐదు లంకా గ్రామాల్లోని కుటుంబాలను తరలింపు ప్రక్రియను పర్యవేక్షించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీవో ఏ . చైత్ర వర్షిణి వివరాలు తెలియ చేస్తూ, గోదావరీ నది తొలి వరద ప్రమాద హెచ్చరికలు నేపధ్యంలో ముందస్తు భద్రతా చర్యల్లో తరలింపు ప్రక్రియ చేపట్టడం జరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలను అనుసరించి రెండవ ప్రమాద హెచ్చరికలు జారీ చేసేకంటే ముందుగా ఈ తరలింపును చేపట్టడం జరిగిందన్నారు. ఎటువంటి మానవ, పశువుల ప్రాణ నష్టం నివారణ చర్యల్లో భాగంగా వారికీ అవగాహాన కలుగచేసి సురక్షితంగా పునరావాస కేంద్రానికి తరలించినట్లు తెలిపారు. నగరంలో చందా సత్రం, అల్కట్ గార్డెన్ మునిసిపల్ కళ్యాణ మండపంలో తగిన మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. బ్రిడ్జి లంక, ఎదుర్లమ్మలంక, కేతవారిలంక కు చెందిన సుమారు ఇప్పటి వరకు 180 మందికి పునరావాసం కలించినట్లు, సుమారు 130 కి పైగా బోట్లు ద్వారా తరలించినట్లు పేర్కొన్నారు. చందా సంత్రం లో 120 మందికీ పైగా, మునిసిపల్ కళ్యాణ మండపంలో సుమారు 60 మంది ఉన్నట్లు తెలిపారు. కేతావారి లంక నుంచి ఇంకా కొందరిని తరలిస్తున్నట్లు తెలిపారు. సోమవారం రాత్రి 8 గంటల తర్వాత రెండవ ప్రమాద హెచ్చరికల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలియ చేశారు. ఆయా పునరావాస కేంద్రాల్లో మెడికల్ క్యాంపు,అత్యవసర మందులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఈ ప్రక్రియని ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, ఫైర్ ఆఫీసర్ కే. మార్టిన్ లూధర్ కింగ్, అదనపు కమిషనర్ పి ఎమ్ సత్యవాణి , అర్బన్ తహసీల్దార్ రాజశేఖర్, మత్స్య శాఖ , పోలీసు అధికారులు తదితరులు పర్యవేక్షణ చెయ్యడం జరిగింది.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *