Breaking News

చేనేత సహకార సంఘాలకు రూ.11.17 కోట్ల రుణ మంజూరు ప్రతిపాదన

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని చేనేత సహకార సంఘాలకు 2024-25 సంవత్సరానికి సంబంధించి రూ.11.17 కోట్ల రుణ మంజూరుకు కమిటీ సభ్యులు ప్రతిపాదించారు. సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో జిల్లాలోని 25 చేనేత సహకార సంఘాలకు కేడీసీసీ బ్యాంకు ద్వారా రుణ మంజూరు కమిటీ సభ్యులు ప్రతిపాదించారు.

గూడూరు మండలంలోని పోలవరం, కప్పలదొడ్డి, రాయవరం, మల్లవోలు, ఐదుగుళ్లపల్లి, పెడన టౌన్, చల్లపల్లి, గన్నవరం మండలంలోని ముస్తాబాద్ ప్రాంతాలకు చెందిన 25 చేనేత సహకార సంఘాలకు వర్కింగ్ క్యాపిటల్ కింద రుణ మంజూరుకు ప్రతిపాదిస్తున్నట్లు తెలిపారు.

ఈ సమావేశంలో చేనేత జౌళి శాఖ ప్రాంతీయ ఉపసంచాలకులు, రాజమహేంద్రవరం డి ధనుంజయ రావు, ఏడి రఘునందన్, డిస్ట్రిక్ట్ కోపరేటివ్ ఆడిట్ ఆఫీసర్ భాస్కరరావు, మార్కెటింగ్ ఆఫీసర్ ఆప్కో విజయవాడ బిఎస్ ప్రసాద్, వీవర్స్ సర్వీస్ సెంటర్ సూపరింటెండెంట్ ఢిల్లీ బాబు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *