-రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్
-అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్తో మంత్రి టి.జి భరత్ భేటీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు ఏర్పాటుచేసేందుకు సహకరించాలని అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ను కోరినట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ తెలిపారు. విజయవాడలో జెన్నిఫర్ లార్సన్ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఆయన చెప్పారు. ఏపీలో పెట్టుబడులు పెట్టే వారికి అన్ని విధాలుగా సహకరిస్తామని అవకాశాలను వివరించినట్లు మంత్రి టి.జి భరత్ పేర్కొన్నారు. అమెరికాలో తెలుగువాళ్లు ఎంతో మంది ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. ఏపీలో కంపెనీలు విస్తరించేందుకు కృషి చేయాలని కోరానన్నారు. ఈ విషయంపై ఆమె సానుకూలంగా స్పందించినట్లు మంత్రి తెలిపారు.