Breaking News

మాదిగ కష్టాలు గ్రహించి తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టుకు అభినందలు

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
గత 30 సంతవ్సరాలుగ రిజర్వేషన్ లలో మాదిగలు అనుభవిస్తున్న క్లేశాలను గమనించి మాదిగలకు సమన్యాయం కావాలంటూ తీర్పునిచ్చిన సుప్రీం కోర్టుకు హార్ఠిక అభినందనలు అభినందనలు తెలుపుతున్నామని ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ (ఈదుముడి ప్రకాశం) తెలిపారు. తెనాలి NGO కళ్యాణ మండపంలో మంళవారం SC వర్గీకరణపై నిర్వహించిన సమీక్షా సమావేశంలోమాదిగలు సంయుక్తంగా కలసి చేసిన ఈ పోరటానికి సహాయ సహకారం అందించిన ప్రధాన మంత్రి మోడీ, ఎపి ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడుకు, జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌కు అభినందనలు తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పును అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

జగన్మోహనరెడ్డి తన అభిప్రాయం ఈ సమయంలో వెలి బుచ్చాలని అన్నారు, చుండూరు అమరులకు ఘనంగా నివాళ్ళు అర్పించారు. ఈ సందర్భంగా గుంటూరుజిల్లా అద్యక్షునిగాకిన్నెర నాగరాజు MRPS ఎంపికైనట్లు తెలిపారు.

ఇంకా ఈకార్యక్రమంలో కటెవరపు కోటేశ్వరావు రాష్ట్రMRPS కో కన్వీనరు ఏటుకూరి విజయకుమార్ రాచేటి రత్నరాజు సాంస్కృతిక జిల్లా కోశాథికారి లీగల్‌ సెల్‌ నాయకులు న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *