గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో ప్రతి ఇంటికి ఆస్తి పన్ను విధిగా ఉండాలని మరియు భవన నిర్మాణం ప్రకారం ఆస్తి పన్ను ఉండాలని, అందుకు ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేయాలని నగర కమీషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ రెవిన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాత్రం తమ ఛాంబర్ నందు రెవిన్యూ విభాగ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ, ఐదు సంవత్సరాల నుండి రెవిన్యూ డిమాండ్ మరియు ఆస్తి విధింపు మరియు ఆస్తి పన్ను పెంపుదల పై రెవిన్యూ ఇన్స్పెక్టర్ల వారీగా, వార్డు సచివాలయాల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే సి.డి.యం.ఎ వారి ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటులో భాగంగా ప్రత్యేక డ్రైవ్ జరుగుతుందని కుళాయి లేని వారు సచివాల్లో కుళాయిల కొరకు దరఖాస్తు చేసుకోవాలని తెలియచేశారు. అలాగే రేపు సోమవారం నుండి అక్టోబర్ 15 దాకా అండర్ అస్సేస్మేంట్ మరియు అన్ అస్సేస్మేంట్ పై ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి సచివాలయ పరిపాలన కార్యదర్శులు ఉదయం 8 గంటల నుండి ఫీల్డ్ లోకి వెళ్లి అండర్ అస్సేస్మేంట్, అన్ అస్సేస్మేంట్ మరియు ఖాళీ స్తలాలను గుర్తించి అవసరమైతే నోటీసులు జారీ చేసి పన్ను విధించాలని, దానికి పూర్తి బాధ్యత అడ్మిన్ సెక్రటరీలు,ఆర్.ఐ లు మరియు ఆర్.ఓ వహించాల్సి ఉంటుందన్నారు. నగరంలో ఖాళీ స్తలాల యజమానుల వివరాల కొరకు డిస్ట్రిక్ట్ రిజిస్టార్ గారికి లేఖ పంపాలన్నారు. ప్రతి రోజు డిప్యూటి కమీషనర్ల వారీగా పురోగతి పై రోజు వారి నివేదికలను అందించాలన్నారు. నిర్దేశిత గడువు అనంతరం, తమ రోజువారీ పర్యటనలో అస్సేస్మేంట్ల పన్ను సరిగా ఉంది లేనిది ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని, వ్యత్యాసం గుర్తించిన యెడల బాద్యుల పై చర్యలు తప్పవని హెచ్చరించారు.
సదరు సమావేశం నందు డిప్యూటి కమీషనర్లు సి.హెచ్ శ్రీనివాసరావు, డి. వెంకట లక్ష్మి, సూపరింటెండెంట్ వెంకటరామయ్య, ఆర్.ఓ యం.డి రెహమాన్, ఆర్.ఐ లు మరియు రెవిన్యూ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
Tags guntur
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …