-కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అనారోగ్యంతో మరణించిన టిడిపి కార్యకర్త ఎర్ర రాజు కుటుంబానికి ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో మంగళవారం ఆర్థిక సాయం అందించారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది 51 వ డివిజన్ టిడిపి అధ్యక్షులు యండి జాహీద్ తో కలిసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిరుపేద అయినటువంటి ఎర్ర రాజు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేయాలని జాహీద్ ఎమ్మెల్యే సుజనా దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే తమ కార్యాలయ సిబ్బందికి మట్టి ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది మంగళవారం నగదును అందజేశారు. కార్యకర్తలకు ఎన్డీయే కూటమి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే సుజనా కు మృతుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.