విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీ కొట్టిన ప్రాంతాన్ని సోమవారం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి పరిశీలించారు. ప్రకాశం బ్యారేజ్ కి చరిత్రలో ఎప్పుడూ లేనంత వరద ఉధృతి కొనసాగుతుందన్నారు. ప్రవాహానికి కొట్టుకు వచ్చిన బొట్ల వలన గేటు కొట్టకు పోయిందని దీనివల్ల ప్రకాశం బ్యారేజ్ కి ఏమి ఇబ్బంది లేదు అన్నారు. వరద తగ్గిన వెంటనే వేగంగా మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు ఇంద్రకీలాద్రిపై ఘాట్ రోడ్డు లో భారీ వర్షాలకి కొండ చరియలు విరిగిపడిన ప్రాంతాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తో కలిసి పరిశీలించారు. కొండ చరియలు విరిగిపడ్డ ఘటనలో ఎవరికి ఎలాంటి హాని జరగలేదని ఘాట్ రోడ్ నిర్మాణం చేపట్టి త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …