Breaking News

బాధితులకు బాసటగా ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి వరద బాధితులకు బాసటగా నిలిచారు. చిట్టినగర్ లోని కామాక్షి విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో నాలుగో రోజు కుడా ఆహారాన్ని సిద్ధం చేశారు. బుధవారం వరకు 80 వేల మందికి పైగా ఆహారాన్ని అందించారు. సుజనా ఫౌండేషన్ సిబ్బంది, ఎన్డీయే కూటమి, వాలంటీర్లు, ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది సమన్వయంతో రేయింబవళ్లు పనిచేస్తున్నారు. ట్రాక్టర్ల ద్వారా ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది, వాలంటీర్లు, ముంపు ప్రాంతాలలో పర్యటిస్తూ ఆహారాన్ని అందిస్తున్నారు. బుధవారం చిట్టినగర్, పాల ఫ్యాక్టరీ, రాజరాజేశ్వరి పేట, ఊర్మిళా నగర్, తదితర లోతట్టు ప్రాంతాలలో పర్యటించి ఆహార ప్యాకెట్లను, వాటర్ బాటిళ్లను, బాధితులకు అందించారు,20,000 వేల వాటర్ బాటిళ్లు బుధవారం పంపిణీ చేశారు. ఇప్పటికే సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మంచినీటి ట్యాంకర్లు పలు డివిజన్ల లో ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. చిట్టినగర్ లోని కామాక్షి విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో గత నాలుగు రోజులుగా నిరంతరాయంగా ఆహారాన్ని సిద్ధం చేస్తున్న వంటశాలను ఎమ్మెల్యే సుజనా బుధవారం పరిశీలించి పనులను పర్యవేక్షించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజారపు అచ్చేం నాయుడు, మంత్రుల బృందం క్షేత్రస్థాయిలో ముంపు ప్రాంతాల్లో పర్యటించి పశ్చిమ ప్రజానీకానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *