Breaking News

వరద బాధితులకు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సహాయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద ముంపు ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జోనల్‌ ఆఫీస్‌ విజయవాడ అండగా నిలుస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు గాను నీట మునిగిన వరద బాధితులకు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జోనల్‌ ఆఫీస్‌ విజయవాడ ఆధ్వర్యంలో బ్రెడ్, వాటర్ బాటిల్ మరియు భోజనాన్ని పంపిణీ చేశారు. టాటా ఏసీ ద్వారా వరద బాధితులకు ఏర్పాటుచేసిన శిబిరాల వద్దకు వెళ్లి ఆహారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *