-వరద బాధితుల సహాయార్థం నిధి వస్తువులు సేకరించాలని పార్టీ శ్రేణులకు పిలుపు
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అధిక ధరలు తగ్గించాలని కోరుతూ ఈనెల ఆరవ తేదీన భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలను వరదల కారణంగా వాయిదా వేయడమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు కె రామకృష్ణ నేడు ఒక ప్రకటన విడుదల చేశారు. వరద బీభత్సం లక్షలాది మందికి కన్నీళ్లు మిగిల్చింది. అందువల్ల అధిక ధరలను తగ్గించాలని కోరుతూ ఈనెల 6వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద చేపట్టిన ధర్నాల కార్యక్రమాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ వాయిదా వేయటమైంది. అందుకు బదులుగా పార్టీ శ్రేణులు వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని సిపిఐ రాష్ట్ర సమితి విజ్ఞప్తి చేస్తున్నది. వరద బాధితుల సహాయార్థం నిధి, నిత్యవసరాలు, వంట సామాగ్రి తదితర వస్తువులను వసూలు చేయాలని సిపిఐ శ్రేణులకు పిలుపునిస్తున్నది.