తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని గ్రామీణ యువతీ, యువకులకు శిక్షణ మరియు ఉద్యోగ ఉపాధి కల్పన నిమిత్తం “సీడప్ (SEEDAP)” మరియు “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యభివృద్ధి సంస్థ(APSSDC)” వారి ఆధ్వర్యంలో *“దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన (DDUGKY)” ద్వారా తిరుపతిలోని “స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మ్యానేజ్మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ మరియు అప్లైడ్ న్యూట్రిషన్ (SIHMCT & AN)” నందు “స్కిల్ కాలేజ్” స్థాపించబడింది.
SIHMCT & AN, తిరుపతి నందు డెమి చెఫ్ ది పార్టీ (కిచెన్ సూపెర్వైసేర్ ) మరియు రెస్టారెంట్ కెప్టెన్ కోర్సులనందు టైనింగ్ తీసుకోని ఉత్తీర్ణులైన యువతీ, యువకులకు 12-09-2024 (గురువారం) నాడు తిరుపతి కలెక్టర్ ఆఫీస్ మీటింగ్ హాల్ లో కలెక్టర్ Dr. S. వెంకటేశ్వర్, ఐఏఎస్ సర్టిఫికెట్స్ ప్రధానం చేసారు. ట్రైనింగ్ తీసుకొని ఉద్యోగం చేస్తున్న పలువురు విద్యార్ధులను అభినందించి మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరాలని కొనియాడారు.
ఈ కార్యక్రమం లో Dr. R . రమణ ప్రసాద్, ప్రిన్సిపాల్, ప్రభావతి, ప్రాజెక్ట్ డైరెక్టర్, DRDA, తిరుపతి, శ్యాం మోహన్, రీజినల్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్, APSSDC, లోకనాధం, డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్, APSSDC, తిరుపతి, సరితా రెడ్డి, JDM, SEEDAP మరియు తిరుపతి స్కిల్ కాలేజీ భోదన, బోధనేతర సిబ్బంది. మరియు విద్యార్థులు పాల్గొన్నారు.