Breaking News

జిల్లాలో నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

-వైద్య, విద్యా, మహిళా శిశు సంక్షేమ శాఖ తదితర అధికారులు బాధ్యతగా జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించాలి : డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో సెప్టెంబర్ 17 న చేపట్టే జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ వైద్య ఆరోగ్యశాఖ తదితర సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ నుండి వర్చువల్ విధానంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈ సెప్టెంబర్ 17 న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం, శౌచాలయానికి వెళ్లి వచ్చాక చేతులను శుభ్రంగా కడుక్కోవడం ద్వారా, పరిశుభ్రతను పాటించడం ద్వారా నులిపురుగుల బారిన పడకుండా నివారించవచ్చని తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా పిల్లలు, కిషోర బాలల కడుపులో నులి పురుగులు నిర్మూలించడానికి ఉచితంగా ఆల్బెండజోల్ 400 మిల్లీగ్రాముల చప్పరించే మాత్రలను 15 వ తేదీ నాటికి సంబంధిత విద్యా సంస్థలకు అందేలా సరఫరా చేయాలన్నారు. సంబంధిత ఎంపిడిఓ, మునిసిపల్ కమీషనర్లు ఎన్డిడి యాప్ నందు ఎంత మందులు కావాలి అని నమోదు చేయాలనీ సూచించారు. జిల్లాలో మొత్తం 4,93,608 మంది విద్యార్థులు ఉండగా అందులో లో అంగన్వాడీ కేంద్రాయముల నందు 98405 మంది, ప్రభుత్వ మరియు ప్రైవేట్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నందు 3,15,915 మంది, ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఇంటర్ మీడియట్ నందు 74523 మంది, బడిబయట పిల్లలు(10-19సం) 4765 మంది ఉన్నారని అందరికీ ఆల్బెండజోల్ 400 మిల్లీగ్రాముల చప్పరించే మాత్రలను అందేలా చూడాలని డిఎంహెచ్ఓ పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ మాత్రలను అన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీ కేంద్రాలకు, ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలు, కళాశాలలు, సంక్షేమ హాస్టళ్లు తదితర విద్యా సంస్థలకు ఉచితంగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తద్వారా నులిపురుగుల సంక్రమణను సులభంగా నిర్మూలించ వచ్చునని పేర్కొన్నారు. 1-2 సం పిల్లలకు సగం మాత్ర 200 mg , 2-19 సం పిల్లలకు 400mg ఒక మాత్ర చప్పరిస్తూ మింగించాలని తెలిపారు. నులిపురుగులు ఉన్న పిల్లలు పోషకాహార లోపం, రక్తహీనత వల్ల నీరసంగా ఉంటారని, శారీరక మానసిక ఎదుగుదల లోపాలను కలిగి ఉంటారని అలాంటి వారందరికీ ఆల్బెండజోల్ చప్పరించే మాత్రలను తప్పనిసరిగా వేయించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్య అధికారులు, మండల పరిధిలో మండల విద్యా శాఖాధికారులు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు పర్యవేక్షించాలని, సంబంధిత శాఖల జిల్లా అధికారులు ఈ కార్యక్రమం పకడ్బందీగా జరిగేలా చూడాలని తెలిపారు.

జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం రోజున ఏదేని కారణం చేత డీ వార్మింగ్ చేయబడని పిల్లలకు మరలా సెప్టెంబర్ 25 న మాప్ అప్ రోజున ఆల్బెండజోల్ మాత్రను చప్పరించి మింగేలా చర్యలు తీసుకోవాలని వైద్యశాఖ అధికారులతో కలెక్టర్ పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డిఎంహెచ్వో డాక్టర్ శ్రీహరి, రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమం ప్రాజెక్ట్ అధికారిని డాక్టర్ పద్మావతి, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని జయలక్ష్మి, డిఈఓ వి.శేఖర్, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి చెన్నయ్య తదితర అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *