తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ మెంబర్ వడిత్యా శంకర్ నాయక్ తిరుపతి శ్రీ పద్మావతి అతిథి గృహం నందు నేటి ఆదివారం గిరిజన సోదర సోదరీమణులు నుండి ఫిర్యాదులను తీసుకున్నారు. అలాగే కీర్తిశేషులు గుండాల నాయక్ సంతాప సూచకంగా బైరాగి పట్టెడ, గిరిజన భవన్ నందు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల రేణిగుంట పరిశీలించి విద్యార్థుల తెలుగు ఇంగ్లీష్ సామర్ధ్యాన్ని పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
Tags tirupathi
Check Also
మద్దిరాలపాడు పర్యటనలో…
ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …