Breaking News

వరద బాధితుల కోసం పలువురు విరాళాలు అందజేత

హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
వరద బాధితుల కోసం పలువురు దాతలు విరాళాలు అందించారు. సీఎం చంద్రబాబును హైదరాబాద్ లో ఆదివారం కలిసి సీఎం సహాయ నిధికి చెక్కులు అందించారు. వీరికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపి, అభినందించారు. విరాళాలు అందించిన వారిలో….

1. జీవీకే ఫౌండేషన్ ఛైర్మన్ జీవీకే రెడ్డి, జీవీ సంజయ్ రెడ్డి రూ.5 కోట్లు.
2. కాంటినెంటల్ కాఫీ తరపున చల్లా శ్రీశాంత్ రూ.1 కోటి 11 లక్షలు
3. చల్లా రాజేంద్రప్రసాద్ ఫ్యామిలీ ఫౌండేషన్ తరపున చల్లా అజిత రూ.1 కోటి.
4. కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఛైర్మన్ అరుణ్ అలగప్ప, ఎండీ శంకర్ సుబ్రహ్మణ్యం రూ.1 కోటి 50 లక్షలు.
5. ట్రైజియో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ వేములపల్లి అశోక్, రోహిత్ వేములపల్లి రూ.1 కోటి.
6. లారస్ ల్యాబ్స్ ఫౌండర్ & సీఈఓ డాక్టర్ సత్యనారాయణ చావా, నాగరాణి చావ రూ.1 కోటి.
7. చలసాని చాముండేశ్వరి, శ్రీమన్ రూ.25 లక్షలు
8. అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ రూ.2 లక్షలు
9. నరసింహారావు రూ.2 లక్షలు అందించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *