Breaking News

వివిధ సమస్యలపై మంత్రి పేర్నిని కలిసి వినతులు సమర్పించిన అర్జీదారులు…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) శుక్రవారం తమ కార్యాలయమునకు వివిధ ప్రాంతాల నుండి వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలను మంత్రి వారి సమస్యలు అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి తమ సిబ్బందిని ఆదేశించారు. ఆర్ టిసి సంస్థలో పని చేసి ఆనారోగ్య కారణాలతో మెడికల్ అన్ ఫిట్ అయిన ఉద్యోగుల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరుతూ పలువురు మంత్రిని కలసి వినతిపత్రం సమర్పించారు. ఆర్ టిసిలలో కారుణ్య నియామకాలలో చనిపోయిన వారి పిల్లలకు న్యాయం చేస్తున్నారని అదే మాదిరిగా మెడికల్ అన్ ఫిట్ అయిన వారి విషయంలో కూడా తగిన న్యాయం చేయాలని జె. సుగుణాకర్ తదితరులు మంత్రిని కోరారు. వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయించాలని కొందరు, ఇళ్ల స్థలాలు ఇప్పించాలని మరి కొందరు, అనారోగ్యంతో బాధ పడుతున్న తమ వారికి మెరుగైన వైద్యం ఇప్పించాలని మరి కొందరు మంత్రికి వినతులు సమర్పించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *