Breaking News

Tag Archives: AMARAVARTHI

వచ్చే ఏడాది ఫిబ్రవరి 9 నుండి 28 వరకూ జనాభా లెక్కల సేకరణ : సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 9వ తేదీ నుండి 28 వరకూ జనాభా లెక్కల సేకరణ జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ వెల్లడించారు. జనాభా లెక్కల సేకరణ-2027పై గురువారం ఎపి సచివాలయంలో రాష్ట్ర స్థాయి కోఆర్డినేషన్ కమిటీ సమావేశం(ఎస్ఎల్సిసి)ఆయన అధ్యక్షతన జరిగింది.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ జనాభా లెక్కల సేకరణ ప్రకియ సజావుగా జరిగేందుకు ఇప్పటి నుండే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.జనాభా లెక్కల సేకరణ ప్రక్రియపై క్షేత్ర స్థాయిలో ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు …

Read More »

లాభాల బాట పట్టిన వైజాగ్ స్టీల్

-కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏడాదిలో ఆనూహ్య ప్రగతి -94 శాతానికి చేరిన ప్లాంట్ కెపాసిటీ యుటిలైజేషన్ -స్టీల్ ప్లాంట్ పురోగతిని సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో విశాఖ ఉక్కు మళ్లీ లాభాల బాట పట్టింది. ఏడాదిన్నరలో అనూహ్య ప్రగతి సాధించిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ 2026 జనవరిలో రూ.54 కోట్ల లాభాన్ని ఆర్జించింది. సచివాలయంలో మంగళవారం విశాఖ ఉక్కు పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు కేంద్ర ఉక్కు …

Read More »

అమెరికా పన్నుల తగ్గింపు దేశ ఆర్థిక వ్యవస్థకు ‘గేమ్ ఛేంజర్’

– ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ మరో చారిత్రాత్మక ఆర్థిక విజయం – ఎంపీ సానా సతీష్ బాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: అమెరికాకు ఎగుమతి అయ్యే భారతీయ ఉత్పత్తులపై పన్నులు 50 శాతం నుంచి కేవలం 18 శాతానికి తగ్గడం దేశ ఆర్థిక వ్యవస్థకు నిజమైన ‘గేమ్ ఛేంజర్’ గా నిలుస్తుందని ఎంపీ సానా సతీష్ బాబు అన్నారు. తాజాగా కుదిరిన భారత్–అమెరికా ట్రేడ్ డీల్ ద్వారా ఈ కీలక నిర్ణయం అమలులోకి వచ్చిందని పేర్కొన్న ఆయన, ప్రధాని నరేంద్ర మోదీ …

Read More »

పెద్దపులి సంచారంపై ప్రజలు ఆందోళన చెందనక్కర్లేదు: మంత్రి కందుల దుర్గేష్

-రాజానగరం సమీపంలో సంచరిస్తున్న పెద్దపులిని పట్టుకునేందుకు అటవీ శాఖ ముమ్మరంగా గాలింపు ప్రయత్నాలు చేస్తోందని వెల్లడి -బోనులు, ట్రాప్ కెమెరాలు, డ్రోన్లతో అటవీశాఖ అప్రమత్తంగా ఉందని, ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలని మంత్రి దుర్గేష్ సూచన -ప్రభుత్వ యంత్రాంగం నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తోందని, ప్రజల రక్షణే తమ ప్రాధాన్యత అని మంత్రి దుర్గేష్ వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలో పెద్ద పులి సంచారంపై ఆందోళన అక్కర్లేదని, పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ట్రాప్, డ్రోన్ …

Read More »

సిఆర్డిఏ అధికారుల ఆధ్వర్యంలో అనధికార లే అవుట్ల ధ్వంసం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: ఏపీ సిఆర్డిఏ పరిధిలో మంగళవారం అక్రమ లే అవుట్లను అధికారులు ధ్వంసం చేయించారు. పల్నాడు జిల్లా అమరావతి మండలం కర్లపూడిలోని సర్వే నెంబర్లు 292, 295, 297, 299, 325, 332 ఎండ్రాయిలోని సర్వే నెంబర్లు 89,198 నరుకుళ్లపాడులోని సర్వే నెం. 123 ధరణికోటలోని సర్వే నెంబర్లు 346, 99 అమరావతిలోని సర్వే నెంబర్లు .64, 65,151 పెదమద్దూరులోని సర్వే నెం. 77 వైకుంఠపురంలోని సర్వే నెం. 264 నెమలికల్లులోని సర్వే నెం. 122 భూమిలో ఏర్పాటవుతున్న అనధికార …

Read More »

తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడటం ప్రభుత్వ కర్తవ్యం

-శ్రీవారి ప్రసాదం నెయ్యి కల్తీని తీవ్రంగా పరిగణిస్తూ దోషులపై కఠిన చర్యలు- -స్వల్పకాలిక పరిపాలనా కమిటీని ఏర్పాటు చేసి ఈ అంశాన్ని సమగ్రంగా సమీక్షిస్తాం -రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: కలియుగ దైవం  వేంకటేశ్వర స్వామి వారు కొలువైవున్న తిరుమల తిరుపతి దేస్థానం పవిత్రతను కాపాడటం ప్రభుత్వం ప్రథమ కర్తవ్యం అని, శ్రీవారి ప్రసాదం నెయ్యి కల్తీని తీవ్రంగా పరిగణిస్తూ దోషులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ …

Read More »

అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా ఏపీ

-వచ్చే ఐదేళ్లలో 50 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యం -త్వరలోనే రాష్ట్రమంతటా శిక్షణా తరగతులు -ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ ఏర్పాటు -లంబసింగిలో కుంకుమ పువ్వు సాగుకు ప్రణాళికలు -వ్యవసాయం, అనుబంధ శాఖలపై సమీక్షలో సీఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: ఏపీని అతిపెద్ద ప్రకృతి వ్యవసాయ క్షేత్రంగా మార్చే కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికారులకు సూచించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18 లక్షల మంది రైతులు.. 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు …

Read More »

రేపు క్యాన్సర్ డే ఉచితంగా ఏటా రూ.600 కోట్లకు పైగానే బాధితులకు క్యాన్సర్ వైద్య సేవలు

-ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్టు ద్వారా చికిత్స పొందే వారి సంఖ్య ఏటా పెరుగుదల -క్యాన్సర్ కేసులతో రూపొందించిన అట్లాస్’ ఆధారంగా ముందస్తు చర్యలు -బోధనాసుపత్రుల్లో ‘పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్’ సేవలపై వైద్యులకు శిక్షణ -ప్రతి జిల్లా కేంద్రం లో, అందుబాటులోకి డే కేర్ కీమోథెరపీ సెంటర్లు -ప్రివెంటివ్ ఆంకాలజీ విభాగాల ఏర్పాటు -అందరి భాగస్వామ్యంతోనే క్యాన్సర్ కట్టడి.. -ముందుకు రావాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పిలుపు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్రంలో క్యాన్సర్ కేసుల నియంత్రణ, వైద్య …

Read More »

క‌ల్తీ నెయ్యిలో రూ.250 కోట్ల మేర అవినీతి జ‌రిగింది

-ప్ర‌పంచంలోని కోట్లాది మంది భ‌క్తుల మ‌నోభావాల్ని దెబ్బ‌తీశారు -క‌ల్తీని వైసిపి నేత‌లు స‌మ‌ర్ధిస్తున్నారా? -సిఎఫ్‌టిఆర్ ఐ రిపోర్టును తుంగ‌లో తొక్కారు -అవినీతికి పాల్ప‌డి ఆల‌య ప‌విత్ర‌ను భ్ర‌ష్టుప‌ట్టించారు -స‌ప్లిమెంట‌రీ చార్జ్‌షీట్ లోని అంశాల‌బ‌ట్టి ముందుకెళ్తాం -వైసిపి వ్య‌వ‌హార‌శైలిపై విరుచుకుప‌డిన వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌ అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త: వైసిపి పాల‌న‌లో తిరుమ‌ల నెయ్యి క‌ల్తీ వ్య‌వ‌హారంలో రూ.250 కోట్ల మేర అవినీతి జ‌రిగింద‌ని వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఆరోపించారు. క‌ల్తీకి పాల్ప‌డ‌డం ద్వారా ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న …

Read More »

విద్యార్తుల కంటి పరీక్షల్లో పొరుగు రాష్ట్రాలకు స్ఫూర్తిగా ఏపీ

-వార్షిక లక్ష్యాన్ని పెంచిన కేంద్రం -రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి -తెనాలిలో కంటి అద్దాల పంపిణీని ప్రారంభించిన మంత్రులు సత్యకుమార్, నాదెండ్ల మనోహర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: విద్యార్థులకు కంటి పరీక్షల నిర్వహణలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం పొరుగు రాష్ట్రాల వారికి ఆదర్శంగా ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత కళ్లజోళ్ల పంపిణీ ప్రారంభ రాష్ట్ర కార్యక్రమం మంగళవారం …

Read More »