-అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ -సీతాయమ్మ హోటల్ వద్ద డ్రైనేజీ పరిశీలించిన ఎమ్మెల్యే, అధికారులు అవనిగడ్డ, నేటి పత్రిక ప్రజావార్త : అవనిగడ్డ గ్రామ ప్రధాన డ్రైనేజీ సమస్య పరిష్కారంపై దృష్టి సారించినట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. బుధవారం స్థానిక సీతాయమ్మ హోటల్ వద్ద డ్రైనేజీని ఎమ్మెల్యే పరిశీలించారు. ఆర్.డబ్ల్యూ.ఎస్ డీఈఈ పాలచర్ల సత్యనారాయణతో కలిసి అవనిగడ్డ గ్రామ డ్రైనేజీ స్వరూప మ్యాప్ పరిశీలించారు. కరకట్ట నుంచి మండపం మీదుగా మురుగు కాలువ వరకూ ఉన్న ప్రధాన డ్రైనేజీని సీతాయమ్మ హోటల్ …
Read More »Tag Archives: AMARAVARTHI
నోబెల్ గ్రహీతతో సీఎం చంద్రబాబు భేటీ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నోబెల్ అవార్డు గ్రహీత ప్రొ. మైఖేల్ కెమెర్తో ఏపీ సీఎం చంద్రబాబు నేడు భేటీ అయ్యారు. రాష్ట్రంలో విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నీటిసరఫరాను మెరుగుపరిచేందుకు చేపట్టాల్సిన చర్యలపై వీరిద్దరూ చర్చలు జరిపినట్లు సీఎంవో అధికారులు తెలిపారు.ముఖ్యంగా గ్రామాల్లో స్వచ్ఛ జలం సరఫరాకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై క్రెమెర్ విలువైన సలహాలు ఇచ్చారని అధికారులు చెప్పారు.
Read More »ఇంజనీరంగ్ తుది విడతలో 17, 575 సీట్లు భర్తీ
-మిగిలి ఉన్న సీట్లు 18,951 -సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు గణేష్ కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంజనీరింగ్ ప్రవేశాలకు నిర్దేశించిన ఎపిఈఎపిసెట్ 2024 కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా మంగళ వారం తుది విడత సీట్ల కేటాయింపును పూర్తి చేసినట్లు సాంకేతిక విద్యా శాఖ సంచాలకులు, ప్రవేశాల కన్వీనర్ గుమ్మల గణేష్ కుమార్ తెలిపారు. విధ్యార్ధులు ఆగస్టు 3 లోపు తమకు నిర్దేశించిన కళాశాలల్లో ఆన్ లైన్ రిపోర్టింగ్ తో పాటు, వ్యక్తిగతంగా కళాశాలలో నమోదును పూర్తి చేయవలసి ఉందన్నారు. అయితే …
Read More »గనులు, అబ్కారీ అధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర సమీక్ష
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గనులు, అబ్కారీ అధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం ఉన్నత స్థాయు సమీక్ష నిర్వహించారు. సచివాలయంలోని ఛాంబర్లో ఎక్సైజ్, గనుల శాఖ ముఖ్యకార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా, ఏపీఎండీసీ ఎండీ ప్రవీణ్ కుమార్లతో విభిన్న అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలు, జిల్లాల వారీగా ఇసుక లభ్యత తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రతి జిల్లా లోనూ డిమాండ్ మేరకు ఇసుక లభించేలా సమన్వయం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలను మించి ఎక్కడా వసూళ్లకు …
Read More »దళితులకు ఆర్థిక భద్రత కల్పించే కార్యక్రమాలు చేపట్టండి
-సాంఘీక సంక్షేమ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్థికంగా అత్యంత వెనుకబాటులో ఉండే దళిత వర్గాలకు ఆర్థిక భద్రత కల్పించే కార్యక్రమాలు రూపొందించాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. సోషల్ వెల్ఫేర్ శాఖపై ముఖ్యమంత్రి సచివాలయంలో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా శాఖ పనితీరు, వివిధ పథకాల అమలుపై అడిగి తెలుసుకున్నారు. 2014 నుంచి 2019 మధ్య తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిథి, సివిల్ సర్వీస్ శిక్షణ కోసం …
Read More »గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదు
-గిరిజన మహిళల సౌకర్యం కోసం మళ్లీ గర్భిణీ వసతి గృహాలు -ట్రైకార్, జిసిసి, ఐటిడిఎలను యాక్టివేట్ చేయండి -గిరిజన సంక్షేమ శాఖపై సమీక్ష లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ వ్యవస్థల విధ్వంసంతో గిరిజన ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని ముఖ్యమంత్రి అన్నారు. అవసరమైన మౌళిక వసతులు కల్పించడం ద్వారా, ఫీడర్ …
Read More »రాజధాని అమరావతి కోసం 4 లక్షలు విరాళం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతి కోసం తుమ్మల మధుస్మిత అనే మహిళ రూ.4 లక్షలు విరాళంగా ఇచ్చారు. సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసి ఈ మేరకు చెక్ అందజేశారు. అమెరికాలోని న్యూ జెర్సీలో పనిచేస్తున్న మధుస్మిత అమరావతికి తనవంతు సహకారంగా ఈ విరాళం ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మధుస్మితను ముఖ్యమంత్రి అభినందించారు. ప్రతి ఒక్కరు రాజధాని నిర్మాణంలో భాగస్వాములు అవ్వాలని సిఎం పిలుపునిచ్చారు.
Read More »ఎన్టిఆర్ భరోసా ఫించన్ల పంపిణీని 1వతేదీ ఉ.6గం.లకే ప్రారంభించాలి
-ఆగస్టు నెలకు 64.82లక్షల ఫించన్లకు రూ.2737.41 కోట్లు విడుదల -1వతేదీనే 96శాతం పంపిణీ,2వ తేదీతో నూరు శాతం ఫించన్ల పంపిణీ పూర్తి చేయాలి -ఫించన్ల పంపిణీ ప్రక్రియలో జిల్లా కలక్టర్లు పాల్గొనాలి -ఫించన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరించండి -గత నెలలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోండి -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆగస్టు 1వ తేదీన ఉదయం 6గం.లకే ఎన్టిఆర్ భరోసా ఫించన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడంతో …
Read More »ఉపాధి హామీ పథకంలో పని చేసే 54 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరనుంది…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదన మేరకు 2024- 25 ఆర్ధిక సంవత్సరానికి గానూ లేబర్ బడ్జెట్ ను 21.50 కోట్ల పనిదినాలకు పెంచడానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అంగీకరించిదని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ తెలిపారు. పెరిగిన పని దినాల వల్ల ఉపాధి హామీ పథకంలో పని చేసే 54 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరనుందని అయన చెప్పారు. లేబర్ బడ్జెట్ మొదటి విడతగా 15 కోట్ల …
Read More »సీబీఐకి అప్పగించమని జీవో ఇచ్చారుగానీ… ముందుకు తీసుకువెళ్లలేదు
-ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలసి వినతి పత్రం అందించిన సుగాలీ ప్రీతి తల్లి పార్వతి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘మా అమ్మాయి సుగాలీ ప్రీతిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కేసును సీబీఐకి అప్పగిస్తూ గత ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే సీబీఐ వరకూ కేసు వెళ్లలేదు’ అని సుగాలీ ప్రీతి పార్వతి కన్నీటి పర్యంతమవుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి వినతి పత్రం అందించారు. మంగళవారం మంగళగిరిలో పవన్ కళ్యాణ్ ని తన కుటుంబంతో …
Read More »
Prajavartha Online Telugu News