-ఆదివారం దుర్గ గుడికి పోటెత్తిన భక్తులు -విఐపి దర్శనాలు రద్దు -వృద్ధులు ‘దివ్యాంగులు కోసం ప్రత్యేక దర్శన ఏర్పాట్ల చేసిన దుర్గగుడి ఈవో శీనా నాయక్ ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఆదివారం రోజున ఇంద్రకీలాద్రి దుర్గా దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా కంటే ఎక్కువగా ఉంది. ఈ రద్దీని నియంత్రించడానికి దేవస్థానం అధికారులు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఈవో పర్యవేక్షణ దేవస్థానం కార్యనిర్వాహక అధికారి స్వయంగా రంగంలోకి దిగి భక్తుల రద్దీని, క్యూ లైన్లను పర్యవేక్షించి క్రమబద్ధీకరించారు. మధ్యాహ్నం మహా …
Read More »Tag Archives: indrakiladri
భవానీ దీక్ష విరమణ ఏర్పాట్లపై సమీక్ష – పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై జరగనున్న భవానీ దీక్ష విరమణ ఉత్సవాల ఏర్పాట్లపై దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈ.ఓ) వి.కె. శీనా నాయక ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ట్రస్ట్ బోర్డు సభ్యులు అవ్వారు శ్రీనివాసరావు, పెనుమత్స రాఘవరాజు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్-2 రాంబాబు, డి.ఈ.లు రవీంద్ర, అశోక్ మరియు ఇతర ఇంజనీరింగ్ విభాగం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పనుల పరిశీలన : ఈ.ఓ. భవానీ దీక్షల పనులు, క్యూ లైన్లు, స్నాన ఘట్టాలు, ప్రసాదం తయారీ కేంద్రాలు, అన్నదానం ఏర్పాట్లు, …
Read More »కార్తీక మాసం, భవానీ దీక్షల కార్యాచరణ గురించి సమావేశం
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : మహా మంటపం 4వ అంతస్తు ఈవో ఛాంబర్లో ఈరోజు మధ్యాహ్నం కార్తీక మాసం, భవానీ దీక్షల కార్యాచరణ గురించి సమావేశం జరిగింది. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వీకే శీనా నాయక్ సమావేశం నిర్వహించి, సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 05 వ తేదీన కార్తీక పౌర్ణమి సందర్బంగానిర్వహించే దీపోత్సవంలో వైదిక కార్యక్రమముల నిర్వహణ, భక్తుల భద్రత రీత్యా తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి సిబ్బంది తో చర్చించారు. భక్తుల భద్రత …
Read More »భక్తుల సంఖ్య గత సంవత్సరం కంటే పది శాతం అధికం
-పూర్ణాహుతితో ఇంద్రకీలాద్రి దసరా మహోత్సవాలు పరిసమాప్తం -అమ్మవారి ఆశీస్సులతో నీతి, నియమాల తో కూడిన జీవనం గడుపుదాం -గడిచిన పది రోజుల్లో దుర్గగుడి ఆదాయం 4కోట్ల 38 లక్షలు -విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : గడచిన సంవత్సరం 12.50 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శిస్తే ఈ సంవత్సరం దాదాపు 15 లక్షల మంది దర్శించుకుంటున్నారని, గతంతో పోలిస్తే ఇది 10 శాతం అధికమని విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు సుజనా చౌదరి అన్నారు. రాజరాజేశ్వరి దేవిగా …
Read More »అమ్మవారి ఆశీస్సులతో ఇరు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి : నందమూరి మోహనకృష్ణ
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : విజయదశమి రోజున అమ్మవారిని దర్శించుకోవడం మహద్భాగ్యమని మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తనయుడు నందమూరి మోహనకృష్ణ అన్నారు. ప్రజలకు ఆయన దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరు తెలుగు రాష్ట్రాలు అమ్మవారి ఆశీస్సులతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించమని అమ్మవారిని వేడుకొన్నట్టు తెలిపారు. లక్షలాదిమంది భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, దేవస్థానం చక్కటి దర్శన ఏర్పాట్లు చేశాయని చెప్పారు. ఎన్టీఆర్ మనమరాలు నందమూరి మోహన రూప మాట్లాడుతూ… అమ్మవారు ప్రజలందరి ఆశలు కోరికలు …
Read More »శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గాదేవి చిరునవ్వులతో శ్రీ రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనభాగ్యాన్ని అనుగ్రహిస్తోంది. చెరుకుగడను వామహస్తముతో ధరించి, దక్షిణ హస్తముతో అభయాన్ని ప్రసాదిస్తూ, శ్రీషోడశాక్షరీ మహామంత్ర స్వరూపిణిగా శ్రీచక్రరాజ అధిష్ఠానదేవతగా వెలుగొందే శ్రీ రాజరాజేశ్వరిదేవిని దర్శించి, అర్చించడం వలన సర్వశుభములు కలుగుతాయి. దసరా ఉత్సవాల సంపూర్ణపుణ్యాన్ని అందరికీ అందింపచేసే అపరాజితాదేవిగా, చల్లనితల్లిగా శ్రీ కనకదుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారంలో దర్శనమిస్తోంది. అమ్మను సేవించి జీవితాన్ని ధన్యం చేసుకుందాము. సకలశుభాలు, విజయాలు శ్రీఅమ్మవారి దివ్యదర్శనం ద్వారా మనకు లభిస్తాయి.
Read More »గడిచిన తొమ్మిది రోజుల్లో దేవస్థానం ఆదాయం 3 కోట్ల 55 లక్షలు: దుర్గగుడి ఈవో శీనా నాయక్
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : దసరా శరన్నవరాత్రుల్లో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి 30వ తేదీ వరకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి 3 కోట్ల 55 లక్షల 82 వేల 374 రూపాయల ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో శీనా నాయక్ తెలిపారు. ఉత్సవాలలో లడ్డు ప్రసాదాలు, దర్శన టిక్కెట్లు, ప్రత్యేక పరోక్ష కుంకుమార్చనలు, చండీ హోమం, శ్రీ చక్ర నవార్చన, ప్రత్యేక ఖడ్గమాల టిక్కెట్ల విక్రయం తదితర వాటి రూపేణా ఈ ఆదాయం వచ్చినట్లు తెలియజేసారు. 300 …
Read More »దసరా రోజున విఐపి దర్శనాలు లేవు
-కృష్ణానది ఉధృతి వల్ల అమ్మవారి తెప్పోత్సవం, జలవిహారం రద్దు. -గురువారం ఉదయం జరిగే పూర్ణాహుతితో దసరా ఉత్సవాలు పరిసమాప్తం. -దుర్గగుడి ఈవో శీనా నాయక్ ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : అమ్మవారి దర్శనానికి భవాని దీక్ష ధారులు అధికంగా తరలివస్తున్నందున గురువారం విఐపి, ప్రోటోకాల్ దర్శనాలను రద్దు చేశామని దుర్గగుడి ఈవో శీనా నాయక్ తెలిపారు. మూలా నక్షత్రం రోజున నిర్వహించిన రీతిలోనే దసరా రోజున కూడాఅన్ని క్యూ లైన్ లలో ఉచిత దర్శనాలు కొనసాగుతాయని చెప్పారు. కృష్ణానది కి వరద ఉధృతి …
Read More »ఇంద్రకీలాద్రిపై త్వరలో నూతన క్యూ కాంప్లెక్స్ : స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి నూతన క్యూ కాంప్లెక్స్ నిర్మించేందుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. దసరా శరన్నవరాత్రులలో పదవ రోజైన బుధవారం శ్రీ మహిషాసుర మర్దిని గా దర్శనమిస్తున్న అమ్మవారిని పట్టాభిరామ్ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… దుర్గగుడి అభివృద్ధికి ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం నూతన క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి ముఖ్యమంత్రి అంగీకరించారని …
Read More »అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
-టీటీడీ బోర్డు సభ్యులు సుచిత్ర ఎల్లా, నన్నపనేని సదాశివరావు -టీటీడీ తరపున అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఇరు తెలుగు రాష్ట్రాలపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలు సుచిత్ర ఎల్లా అన్నారు. బుధవారం ఇతర బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు, టి. జానకి దేవి, ఏ. రంగశ్రీ లతో కలిసి టీటీడీ తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సుచిత్ర ఎల్లా మాట్లాడుతూ…. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం …
Read More »
Prajavartha Online Telugu News