Breaking News

Tag Archives: indrakiladri

శ్రీకాళహస్తి దేవస్థానం నుండి అమ్మవారికి పట్టు వస్త్రాలు…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త: శ్రీకాళహస్తి దేవస్థానం నుండి అమ్మవారికి పట్టు వస్త్రాలను ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఈ.వో కె.వి సాగర్ బాబు సమర్పించారు. గురువారం శ్రీకాళహస్తి దేవస్థానం నుండి పట్టు వస్త్రాలను ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఈ.వో కె.వి సాగర్ బాబు అమ్మవారి పేరున కనకదుర్గమ్మ ఆలయం ఈవో డి భ్రమరాంబకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి దేవాలయం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల …

Read More »

అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త: శుక్రవారం రాత్రి తెలంగాణ పశుసంవర్ధక, మత్స్య, సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ లలిత త్రిపుర సుందరీ దేవి అలంకారంలో ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ఇంధ్రకేలాద్రి మీడియా పాయింట్ వద్ద మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా ఏర్పాట్లు బాగున్నాయని తెలిపారు. అమ్మవారి దర్శనం బాగా జరిగిందని, ఆలయ ఈవో డి.భ్రమరాంబ, దేవాదాయ శాఖ మంత్రి …

Read More »

భక్తులకు అధికారులు చేసిన ఏర్పాట్లు బాగున్నాయి… : మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి

ఇంద్ర‌కీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నపూర్ణదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మఅమ్మవారిని గురువారం రాష్ట్ర అటవీ, పర్యావరణ, ఇంధన, సైన్స్ అండ్ టెక్నాలజీ, గనుల శాఖ మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ ఈవో డి. బ్రమరాంబ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా అమ్మవారి శేషవస్త్రం, అమ్మవారి చిత్రపటము, ప్రసాదము అంద జేశారు. దర్శనానంతరం మీడియా సెంటర్ లో మంత్రి మాట్లాడుతూ అన్నపూర్ణదేవి అలంకారమంలో ఉన్న కనకదుర్గమ్మ …

Read More »

భవానీ మాలధారుల ఇరుముడి విరమణ హోమగుండాలకు శాస్త్ర రీత్యా కార్తీకమాసం శ్రేయస్కరం….

-విష్ణుభట్ల శివప్రసాద్ ఇంద్ర‌కీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం ఆలయ వైదిక కమిటీ, ఆలయ స్థానాచార్య విష్ణుబొట్ల శివ ప్రసాద్ శర్మ ఆలయ మీడియా వేదికనుండి ఇరుముడుల విరమణ, హోమగుండం విషయాలపై మాట్లాడుతూ కాలచక్రంలో వసంత ఋతువుకు, శరత్ ఋతువుకు మధ్య విషఘడియలు గల ఋతువులుగా చెప్పబడినవన్నారు. ఆ విషఘడియల ప్రభావం భూమి మీద లేకుండా కాపాడే శక్తిఅయిన దుర్గమ్మను దర్శిస్తే దుర్గతులు నశిస్తాయని, అదే విధంగా వసంత ఋతువులో వసంత నవరాత్రులు, శరత్ ఋతువులో శరన్నవరాత్రులు నిర్వహించడం జరుగుతుందన్నారు. …

Read More »

ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ మూడవరోజు ఆదాయం

ఇంద్ర‌కీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త: దసరా నవరాత్రులు మూడవరోజు బుధవారం నాడు వివిధ సేవల టిక్కెట్ లు, ప్రసాదాలు అమ్మకాలు ద్వారా రూ. 38 లక్షల 112 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈ ఓ డి. భ్రమరాంబ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దసరా శరన్నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ ఆలయానికి సమకూరిన ఆదాయాన్ని వివరిస్తూ రూ. 500 టిక్కెట్స్ అమ్మకాల ద్వారా రూ. 12 లక్షల రూపాయలు, రూ. 300 టిక్కెట్స్ అమ్మకాల ద్వారా రూ. 6 లక్షల 41 వేల …

Read More »

నాలుగో రోజు కనకదుర్గమ్మ వారు అన్నపూర్ణాదేవి

ఇంద్ర‌కీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త: శరన్నవరాత్రి మహోత్సవాల్లో నాలుగో రోజు గురువారం శ్రీకనకదుర్గ అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తారు. అన్నపూర్ణాదేవి అన్నమును ప్రసాదించే మాతృమూర్తి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం సర్వజీవనాధారం, అన్నం లేనిదే జీవులకు మనుగడలేదు. శ్రీ అన్నపూర్ణాదేవి ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో ఉన్న అమృతాన్నము, వజ్రాలు పొదిగిన గరిటతో సాక్షాత్తుగా ఈశ్వరునికే బిక్షను అందించే అంశము అద్భుతము! సర్వ పుణ్యప్రదాయకము. లోకంలో జీవుల ఆకలి తీర్చటం కన్నా మిన్న ఏది లేదు. ఈ నిత్యాన్నధానేశ్వరి అలంకారంలోవున్న శ్రీదుర్గమ్మని దర్శించి …

Read More »

శ్రీ గాయత్రీ దేవి

ఇంద్ర‌కీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త: ముక్తా విద్రుడు హేమ నీల ధవళచ్ఛాయై ర్ముఖై స్త్రీక్షణైః యుక్తా మిందునిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికామ్ | గాయత్రీం వరదాభయాంకుశకశాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్ర మదారవింద యుగళం హసైర్వహంతీభజే|| శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీగాయత్రీదేవి గా దర్శనమిస్తారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధిపొంది ముక్తా, విద్రుమ, హేమ నీల, దవళ వర్ణాలతో ప్రకాశించు పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సుయందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖయందు రుద్రుడు నివసిస్తుండగా త్రిమూర్త్యాంశగా …

Read More »

రెండవరోజు కనకదుర్గమ్మ వారు బాలా త్రిపుర సుందరీదేవి

ఇంద్ర‌కీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త: శరన్నవరాత్రుల్లో భాగంగా రెండవ రోజైన మంగళవారంనాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ బాలా త్రిపుర సుందరీదేవిగా సాక్షాత్కరిస్తుంది. మనసు, బుద్ధి, చిత్తం ఈ దేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో ఉండే ఈ తల్లి అనుగ్రహం కోసం ఉపాసకులు బాలార్చన చేస్తారు. ఈ రోజు రెండు నుండి పదేళ్ళ లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజించి కొత్త బట్టలు పెడతారు. అమ్మవారికి ఆకుపచ్చ, ఎరుపు, పుసుపు రంగు చీరలు కట్టి పాయసం, గారెలు నైవేద్యంగా నివేదిస్తారు.

Read More »

అమ్మవారి దర్శనానికి వచ్చే వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సమయం కేటాయింపు…

-డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఇంద్ర‌కీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త: ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునే వృద్ధులు, దివ్యాంగులకు రేపటి మంగళవారం నుండి అక్టోబర్ ఐదు మూలా నక్షత్రం రోజు మినహా మిగిలిన రోజులలో ఉదయం 10:00 గంటలు నుంచి 12:00 గంటలు వరకు, సాయంత్రం 4:00 గంటల నుంచి 6:00 గంటల వరకు నగరంలోని మోడల్ గెస్ట్ హౌస్ నుండి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.వీరిని బస్సులలో అమ్మవారి …

Read More »

దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న గ‌వ‌ర్న‌ర్ దంప‌తులు

ఇంద్ర‌కీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త: క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకోవ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని, అమ్మ‌వారిద‌ర్శ‌నంతో స‌క‌ల శుభాలు చేకూరుతాయ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ హ‌రిచంద‌న్ అన్నారు. ఇంద్ర‌కీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామ‌ల్లేశ్వ‌ర స్వామివార్లను గ‌వ‌ర్న‌ర్ దంప‌తులు సోమ‌వారం ఉద‌యం 9 గంట‌ల‌కు ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ దంప‌తుల‌కు ఆల‌య ఈఓ ద‌ర్భ‌ముళ్ళ భ్ర‌మరాంబ ఆల‌య మ‌ర్యాద‌ల‌తో మంగ‌ళ‌వాయిద్యాల‌తో వేద‌మంత్రాల న‌డుమ‌ పూర్ణ‌కుంభం స్వాగ‌తం ప‌లికారు. ఈ క్ర‌మంలో శ్రీ స్వర్ణ‌క‌వ‌చాలంకృత దుర్గాదేవి అలంకారంలో ఉన్న క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న అనంత‌రం గ‌వ‌ర్న‌ర్ మీడియాతో …

Read More »