-సబ్ కలెక్టర్ జి.ఎస్ఎస్ ప్రవీణ్ చంద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారానికి 41 అర్జీలు అందాయని సబ్ కలెక్టర్ జి.ఎస్ఎస్ ప్రవీణ్ చంద్. తెలిపారు. వీటిలో అత్యధికంగా రెవెన్యూ 9, విద్యా శాఖ 2, పౌర సరఫరాలు 2, పోలీస్ శాఖ 4, ఏపి టౌన్షిప్ 1, మెప్మా 5, గ్రామీణాభివృద్ధి 2, సెర్ప్ 4, హౌసింగ్ 1, మహిళశిశు సంక్షేమం 1, సర్వే అండ్ ల్యాండ్ రికార్సు 3, వైద్యం 1, గ్రామ వార్డు వాలంటీర్లు 2, పంచాయతీరాజ్ 1, పురపాలక 3 చొప్పున 41 దరఖాస్తులు అందాయన్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టరు కార్యాలయ పరిపాలనాధికారి ఎస్. శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News