ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి అమ్మ దర్శనం ఆధ్యాత్మిక వాతావరణంలో సంతృప్తికరంగా జరిగేలా చేసిన ఏర్పాట్లు విజయమంతమవుతున్నాయి. అమృతతుల్యమైన అన్నప్రసాదాన్ని అందించడంలో ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ అన్న ప్రసాదం తయారీ, అందజేయడంపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు.
Prajavartha Online Telugu News