-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్.ఎం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్.యం గురువారం ఉదయం వరద ప్రభావిత ప్రాంతాలలో విజయవాడ నగరపాలక సంస్థ వారు పైప్ లైన్ ద్వారా సరఫరా చేస్తున్న నీరును కేవలం వాడుటకు మాత్రమే ఉపయోగించవలసిందిగా ప్రజలను కోరారు. కబేలా, ఊర్మిళ నగర్, ఐరన్ యార్డ్ , నైజాం గేట్, పాత రాజరాజేశ్వరి పేట, కంసాలిపేట, కొత్త రాజరాజేశ్వరి పేట, నందమూరి నగర్, ఇంద్ర నాయక్ నగర్, సింగ్ నగర్, రాజీవ్ నగర్, కండ్రిక, ఎంఎస్సీ బోస్ నగర్ పరిసర ప్రాంత ప్రజలందరూ పైప్లైన్ ద్వారా సరఫరా అవుతున్న నీటిని కేవలం వాడుటకు మాత్రమే వినియోగించాలని, ఈ నీటిని త్రాగుటకు వినియోగించవద్దని ప్రజలను విన్నవించారు. పైప్లైన్ ద్వారా సరఫరా చేస్తున్న నీళ్లను త్రాగటానికి వాడొద్దని, వరద ప్రభావిత ప్రాంతాలలో ప్రజలందరికీ త్రాగుటకు మంచినీరును ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారని, ప్రజలు ట్యాంకర్ ద్వారా సరఫరా చేయబడుతున్న త్రాగునీటినే తాగటానికి వినియోగించవలనని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్.ఎం అన్నారు.