-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, పార్లమెంటులో సిపిఐ పక్షనేత, ఎంపి సంథోష్ కుమార్ ఈ నెల 6వ తేదీన విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వెల్లడిరచారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల సంభవించిన వరదల కారణంగా ఎన్టిఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలలో పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ముఖ్యంగా విజయవాడ నగరంలో వరద భీభత్సం సృష్టించింది. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. గత 5 రోజులుగా వరద కోరల్లో చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ కడు భారంగా జీవిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, పార్లమెంట్లో సిపిఐ పక్షనేత, ఎంపి సంథోష్ కుమార్ ఈ నెల 6వ తేదీన విజయవాడ రానున్నారు. కేసరపల్లి, సింగ్నగర్, వైఎస్ఆర్ కాలనీ, భవానీపురం, ప్రకాశం బ్యారేజీ, గుంటూరు జిల్లాలోని తాడేపల్లి ప్రాంతాలలో పర్యటించనున్నారు.