Breaking News

ఈ నెల 6న వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్న ఎంపి సంథోష్‌ కుమార్‌

-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, పార్లమెంటులో సిపిఐ పక్షనేత, ఎంపి సంథోష్‌ కుమార్‌ ఈ నెల 6వ తేదీన విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వెల్లడిరచారు. ఈ మేరకు కె.రామకృష్ణ నేడొక ప్రకటన విడుదల చేశారు. ఇటీవల సంభవించిన వరదల కారణంగా ఎన్‌టిఆర్‌, కృష్ణా, గుంటూరు జిల్లాలలో పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ముఖ్యంగా విజయవాడ నగరంలో వరద భీభత్సం సృష్టించింది. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. గత 5 రోజులుగా వరద కోరల్లో చిక్కుకుని బిక్కుబిక్కుమంటూ కడు భారంగా జీవిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, పార్లమెంట్‌లో సిపిఐ పక్షనేత, ఎంపి సంథోష్‌ కుమార్‌ ఈ నెల 6వ తేదీన విజయవాడ రానున్నారు. కేసరపల్లి, సింగ్‌నగర్‌, వైఎస్‌ఆర్‌ కాలనీ, భవానీపురం, ప్రకాశం బ్యారేజీ, గుంటూరు జిల్లాలోని తాడేపల్లి ప్రాంతాలలో పర్యటించనున్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *