Breaking News

జిల్లాలో ప్రముఖుల పర్యటనలు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఈ నెల 13 మరియు 14 తేదీలలో పలువురు ప్రముఖులు పర్యటించ నున్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. త్రిపుర రాష్ట్ర గవర్నర్ ఇంద్ర సేనా రెడ్డి నల్లు ఈనెల 13న సాయంత్రం హైదరాబాదు విమానాశ్రయం నుండి బయలుదేరి 7. 30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం 8 గంటలకు తిరుపతి ఖాదీ కాలనీ నందు టిటిడి బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి ని కలుస్తారు. అనంతరం 9:30 గంటలకు తిరుమల బయలుదేరి వెళ్తారు. 14వ తేదీ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుని మధ్యాహ్నం 1 గంటకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని హైదరాబాద్ తిరిగి ప్రయాణం కానున్నారు. హిమాచల్ ప్రదేశ్ డిప్యూటీ సీఎం ముఖేష్ అగ్నిహోత్రి ఈనెల 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరి 1.10 గంటలకు తిరుపతి విమానాశ్రయం చేరుకుని తిరుపతిలో బస చేస్తారు. ఈనెల 15న ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పెనుగంచిప్రోలులో మజ్జిగ పంపిణీ కార్యక్రమం

పెనుగంచిప్రోలు, నేటి పత్రిక ప్రజావార్త : పెనుగంచిప్రోలు మండలంలో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్, పెనుగంచిప్రోలు బ్రాంచ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *