Breaking News

Latest News

డెంటల్, ఆయుష్ కోర్సుల్లో 76.17%-85% సీట్లు అమ్మాయిలకే..!

-కన్వీనర్, యాజమాన్య కోటాలోనూ వీరిదే హవా -2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశాల తీరిది -ముగిసిన ప్రవేశాలపై మంత్రి సత్య కుమార్ కు నివేదించిన ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : యూజీ వైద్య విద్యలోని అన్ని కోర్సుల్లో అమ్మాయిలే అధిక శాతం సీట్లు దక్కించుకున్నారు. డెంటల్, ఆయుష్ వైద్య విద్యలో ప్రవేశాలు పొందిన వారిలో అమ్మాయిల శాతం 76.17% నుంచి 85% మధ్య నమోదైంది ఎంబీబీఎస్ లో సీట్లు పొందిన వారిలో అమ్మాయిలు 60.72% మంది ఉన్నారు. 2025-26 విద్యా …

Read More »

ప్రపంచ స్థాయి టెక్నాలజీ హబ్ గా అమరావతి

-క్వాంటం వ్యాలీ ఏర్పాటుతో యువతకు ఉజ్వల భవిష్యత్తు -భూమి పూజతో ఐటీ రంగంలో సరికొత్త విప్లవానికి బీజం! -సీఎం చంద్రబాబు కృషి ప్రశంసనీయ o -రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ గమనాన్ని మార్చే ఒక మహా అద్భుతానికి అమరావతి వేదికగా నిలిచిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి  సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు శనివారం సీఎం చంద్రబాబు చేతులమీదగా జరిగిన భూమి పూజ రాష్ట్ర భవిష్యత్తును …

Read More »

గుడిసెలో నాలుగు గంటలు ఉన్నా పశువులకు హాని చేయని పులి

-డి ఎఫ్ వో ప్రభాకర రావు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం కూర్మాపురం గ్రామంలో శుక్రవారం రాత్రి ఒక గుడిసె ఇంట్లోకి ప్రవేశించిన పులి సుమారు నాలుగు గంటల పాటు అక్కడే , అదే పాకలో ఉన్నప్పటికీ, సమీపంలో ఉన్న రెండు గేదెలకు ఎలాంటి హాని కలగలేదని జిల్లా అటవీ అధికారి బి. ప్రభాకర రావు శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. గ్రామంలో ఉన్న పశువులను లేదా ప్రజలను పులి ఎలాంటి విధంగా హానిచేయకుండా ప్రశాంతంగా …

Read More »

భారతీయ వాయుసేన ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ*ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహణ

-ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మరియు -దేశ సేవలో పాల్గొనే అవకాశాన్ని అంది పుచ్చుకోవాలి -ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రాష్ట్రాల భారత వాయు సేన భర్తీ అధికారి వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : భారత వాయు సేన (ఇండియన్ ఎయిర్ ఫోర్స్) లో “అగ్ని వీర్ -వాయు” గా భర్తీ చేసేటందుకు ఓపెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ ని మార్చ్ నెలలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్వహించబోతున్నట్లు ఆంధ్రప్రదేశ్ & …

Read More »

2024-26 ఏపీ పర్యాటక రంగంలో స్వర్ణయుగం

-రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి -20 నెలల్లో రూ.30,000 కోట్ల పర్యాటక పెట్టుబడులు, 1.22 లక్షల ఉద్యోగాలు సృష్టించామని స్పష్టం -“ప్రతి కుటుంబానికి ఒక పర్యాటక ఉద్యోగం” కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం చంద్రబాబు సూచనలతో “హెల్తీ, వెల్తీ, హ్యాపీ” నినాదంతో అంతర్జాతీయ పర్యాటక గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దుతున్నామన్న మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం 2024-26 మధ్యకాలంలో ఒక అపూర్వమైన స్వర్ణ యుగాన్ని …

Read More »

త్వరలో రాజమండ్రి విమానాశ్రయ నూతన టెర్మినల్ : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి విమానాశ్రయంలో నూతన టెర్మినల్ నిర్మాణ పనులను కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శనివారం క్షేత్ర స్థాయిలో సమీక్షించారు. విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి.. తొలుత విమానాశ్రయ అధికారులు, ఎయిర్పోర్ట్ అధారిటీ అధికారులతో సమీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు బలరామ కృష్ణ, ఆదిరెడ్డి వాసులు పాల్గొన్నారు. విమానాశ్రయంలో జరుగుతున్న టెర్మినల్ అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా క్షేత్రస్థాయిలో సమీక్షించి, టెర్మినల్ భవనం నిర్మాణాన్ని పరిశీలించారు. పనులను వేగవంతం చేసి మార్చి 31నలోపు పూర్తి …

Read More »

ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి కార్యక్రమం  

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (AIDSO) ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా ప్రధమ విజయవాడ జోన్ విద్యార్థుల మహాసభలను స్థానిక ప్రెస్ క్లబ్ నందు నిర్వహించడం జరిగింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా విజయవాడలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికై విద్యార్థుల మహాసభలను ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా ముఖ్య ఉపన్యాసకులుగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు వి హరీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ …

Read More »

సుజనా ఫౌండేషన్ మొబైల్ మెడికల్ క్యాంపుకు అనూహ్య స్పందన…

-ఎమ్మెల్యే సుజనా చౌదరి సేవలను కొనియాడిన కూటమి నేతలు.. విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి సేవలు ఎనలేనివని కూటమి నేతలు కొనియాడారు. ఇటీవల ఎమ్మెల్యే సుజనా చౌదరి సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు మొబైల్ క్లినికల్ వ్యాన్ లను పశ్చిమ ప్రజల కోసం ఏర్పాటు చేయడం జరిగింది.. ఈ మెడికల్ వ్యాన్ల ద్వారా నేటి నుంచి మొబైల్ మెడికల్ క్యాంపులను ప్రారంభించారు. భవానీపురం 42 వడివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలోని 300, 400 చదరపు అడుగుల …

Read More »

పశ్చిమలో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీ

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ కమిషనరేట్ లో డ్రగ్స్ పై దండయాత్ర కార్యక్రమం. 12వ రోజు సైకిల్ యాత్ర కార్యక్రమం జరిగింది. పశ్చిమ నియోజకవర్గంలోని భవానిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత వైభవంగా కార్యక్రమం జరిగింది. శనివారం యాత్ర 17 కిలోమీటర్ల మేరకు యాత్రను కొనసాగించారు. ఇప్పటి వరకు 142 కిలోమీటర్లు యాత్రను కొనసాగించారు. శివాలయం సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర …

Read More »

శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లు

శ్రీశైలం, నేటి పత్రిక ప్రజావార్త : • ఈ సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు 08.02.2026 నుండి 18.02.2026 వరకు 11 రోజులపాటు నిర్వహింపబడనున్నాయి. • ఫిబ్రవరి 8వ తేదీ ఉదయం 9.00 గంటలకు యాగశాల ప్రవేశముతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. • ఫిబ్రవరి 18 తేదీన రాత్రి జరిపే పుష్పోత్సవ, శయనోత్సవాలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ముఖ్య కార్యక్రమాలు : • 08.02.2026 – ధ్వజారోహణ, • 09.02.2026 – భృంగివాహనసేవ, • 10.02.2026 – హంసవాహనసేవ, • 11.02.2026 – మయూరవాహనసేవ, • 12.02.2026 – …

Read More »