Breaking News

Latest News

టమాటా ధరలపై తప్పుడు ప్రచారం.. రైతుల ప్రయోజనాలతో చెలగాటమా?: మంత్రి అచ్చెన్నాయుడు

– వాస్తవాలు తెలుసుకోకుండా రైతుల సమస్యలను రాజకీయాలకు వాడుకోవడం సరికాదు – రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా మార్కెట్ పరిస్థితులపై నిరంతర సమీక్ష – జూలై 5 నుంచి 261 టన్నుల టమాటా కొనుగోలు.. రైతు బజార్లలో నో లాస్–నో ప్రాఫిట్ విధానంలో విక్రయాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : టమాటా ధరలపై వాస్తవ పరిస్థితులను తెలుసుకోకుండా రైతులకు కిలోకు కేవలం రూ.2 మాత్రమే లభిస్తోందంటూ వైసిపి పార్టీ తప్పుడు ప్రచారం చేయడం బాధ్యతారాహిత్యమని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు …

Read More »

తాగునీటికి తొలి ప్రాధాన్యత… రైతులకు సాగునీటి కొరత రాకుండా అన్ని చర్యలు

-గోదావరి నీటి పరిస్థితిపై ఇరిగేషన్ ఇంజనీర్-ఇన్-చీఫ్ కంచరాన నరసింహమూర్తి వివరాలు వెల్లడి రాజమహేంద్రవరం (ధవళేశ్వరం), నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో తక్కువ వర్షపాతం, గోదావరి నదిలో గణనీయంగా తగ్గిన ప్రవాహాల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యత ఇస్తూనే, రైతులకు సాగునీటి కొరత రాకుండా ప్రభుత్వం అన్ని ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతోందని జలవనరుల శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ (ENC) కె. నరసింహమూర్తి తెలిపారు. శనివారం ధవళేశ్వరం ఇరిగేషన్ కార్యాలయంలో గోదావరి నదీ ప్రవాహ పరిస్థితులు, సాగునీటి సరఫరా, తాగునీటి లభ్యతపై పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. …

Read More »

జూలై 27 నుంచి 40 రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం – బొండా ఉమామహేశ్వరరావు

-ప్రతి ఇంటికీ కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని చేరవేయడమే లక్ష్యం -‘2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ BRTS రోడ్డులోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో శనివారం ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జూలై 27 నుంచి ప్రారంభం కానున్న “ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమంపై కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు …

Read More »

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బొండా ఉమ… బీ-ఫారం పట్టాదారులకు రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు అందజేత

-బీ-ఫారం పట్టాదారులకు శుభవార్త.. రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన బొండా ఉమ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ BRTS రోడ్డులోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల కార్యాలయంలో శనివారం ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో నేతాజీ కాలనీ, పి.వి. నరసింహారావు రోడ్, తుంగం రాములు వీధి ప్రాంతాలకు చెందిన బీ-ఫారం పట్టాదారులకు ఇచ్చిన హామీని అమలు చేస్తూ ఈరోజు తొలి విడతగా ఒక్కో డివిజన్ నుంచి ఒక్కొక్కరి చొప్పున మొత్తం ముగ్గురికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి పట్టాలను స్వయంగా …

Read More »

ఏపీసీపీడీసీఎల్‌లో పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన మరో మైలురాయి

-50,114 సౌర విద్యుత్ కనెక్షన్లు పూర్తి – 180 మెగావాట్ల సామర్థ్యం గ్రిడ్‌కు అనుసంధానం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీసీపీడీసీఎల్) పరిధిలో ప్రధానమంత్రి పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అమలులో మరో కీలక మైలురాయిని అధిగమించింది. ఈ పథకం కింద మొత్తం 50,114 సౌర విద్యుత్ (రూఫ్‌టాప్ సోలార్) కనెక్షన్లు పూర్తి చేసి, 180 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని రాష్ట్ర విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానం చేసినట్లు ఏపీసీపీడీసీఎల్ ఛైర్మన్ & …

Read More »

తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నారా రోహిత్ జన్మదిన వేడుకలు

-ప్రభుత్వ ఆసుపత్రులు, బస్ స్టాండ్లు, అనాథాశ్రమాల్లో సేవా కార్యక్రమాలు – 329 యూనిట్ల రక్త సేకరణ హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త : విలక్షణ నటుడు నారా రోహిత్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. కేక్ కటింగ్ వంటి సంప్రదాయ వేడుకలతో పాటు సమాజానికి ఉపయోగపడే పలు సేవా కార్యక్రమాలు చేపట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నంలో నిర్వహించిన భారీ రక్తదాన శిబిరాల్లో అభిమానులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ మూడు కేంద్రాల్లో …

Read More »

రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న భవన్ విజయవాడ నందు శనివారం పత్రికా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీడబ్ల్యూసీ సభ్యులు, మాజీ పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా గత 26 రోజులుగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు శాంతియుతంగా చేపట్టిన ఉద్యమం, పోలీసుల నిర్బంధాలు, దమనకాండను ధైర్యంగా ఎదుర్కొన్న పోరాటం ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ విజయం దేశ …

Read More »

నేడు (ఆదివారం) రాష్ట్ర పండుగగా ప్రగడ కోటయ్య జయంతి

-చీరాలలో రాష్ట్ర జయంత్యోత్సవం -హాజరుకానున్న మంత్రి సవిత అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : నేడు(ఆదివారం) ప్రజాబంధు ప్రగడ కోటయ్య జయంతిని రాష్ట్ర పండుగగా కూటమి ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ మేరకు ఇప్పటికే ప్రభుత్వం జీవో కూడా జీవో జారీచేసింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ప్రగడ కోటయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించనున్నారు. కోటయ్య రాష్ట్ర స్థాయి జయంత్యోత్సవం బాపట్ల జిల్లాలోని చీరాలలో నిర్వహించనున్నారు. రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి ప్రగడ కోటయ్య విశేష సేవలు అందించారు. స్వాతంత్ర్యం రాకముందు, వచ్చిన తరవాత కూడా …

Read More »

అధికారులు.. సిబ్బందికి మంత్రి సత్యకుమార్ అభినందనలు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : మంత్రి వస్తున్నారంటే… ప్రొటోకాల్, హడావుడి, దూరంగా నిలబడే అధికారులు, సిబ్బంది… ఇవే సాధారణంగా కనిపించే దృశ్యాలు. కానీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వ్యవహారశైలి మాత్రం ఇందుకు భిన్నంగా కనిపించింది. కర్నూలు జిల్లా ఆస్పిరి పీహెచ్సీ లో శనివారం సాయంత్రం సంజీవని ప్రారంభ కార్యక్రమం ముగిసిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఉద్యోగులు ఫొటో కోసం ముందుకొచ్చారు. హడావుడి లేకుండా, వారిలో ఒకరిగా నిలబడి అందరితో కలిసి మంత్రి ఫొటో దిగారు. కార్యక్రమం విజయవంతంగా …

Read More »

సింహపురి ఈ-బస్సు డిపోలో పవర్ రూమ్ ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

-రవాణా రంగంలో PM e- Bus Sewa తో నూతన శకం మొదలు -ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలు విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో పర్యావరణహిత, ఆధునిక ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. శనివారం విశాఖపట్నంలోని సింహపురి ఈ-బస్సు డిపోలో పవర్ రూమ్‌ను ప్రారంభించి, డిపోలో ఏర్పాటు చేస్తున్న సబ్‌స్టేషన్, ఛార్జింగ్ స్టేషన్ తదితర మౌలిక …

Read More »